HomeTelanganaPolitics

వర్మ ‘వ్యూహం’ మూవీకి షాక్ ఇచ్చిన హైకోర్టు

వర్మ ‘వ్యూహం’ మూవీకి షాక్ ఇచ్చిన హైకోర్టు

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'వ్యూహం' సినిమాకు మరోసారి హైకోర్టు బ్రేక్ వేసింది.సెన్స

అందరి దగ్గర డబ్బులు తీసుకోండి, మీకు నచ్చిన వాళ్ళకు ఓటేయండి… ఆర్జీవీ
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడిగినా మూవీ చేయను , నేను జగన్ అభిమానిని… ఆర్జీవీ
వర్మ మళ్ళీ గెలికాడు… అచ్చుగుద్దినట్టు పవన్ ను దించేశాడు

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ సినిమాకు మరోసారి హైకోర్టు బ్రేక్ వేసింది.సెన్సార్ బోర్డు గతంలో ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను క్వాష్ చేసింది. ఎగ్జామింగ్ కమిటీ ఇచ్చిన సవరణలను రివ్యూ కమిటీ పట్టించుకోకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల్లో మరోసారి సినిమాను పరిశీలించి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. మరోసారి రెండు కమిటీలు సినిమా చూసి తమకు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది.

వ్యూహం మూవీ టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచేలా ఉందంటూ ఆ పార్టీ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సినిమాను విడుదల చేయ‌వద్దని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఏకంగా సెన్సార్ సర్టిఫికెట్ ను క్వాష్ చేసింది.