HomeTelanganaUncategorized

విద్యుత్ షాక్ తో వ్యక్తికి తీవ్ర గాయాలు…ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు..

విద్యుత్ షాక్ తో వ్యక్తికి తీవ్ర గాయాలు…ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు..

విద్యుత్ షాక్ తో వ్యక్తికి తీవ్ర ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు..… ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.. పోలీస్ స్టే

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ : పేర్లు ఇవేనా?
బీజేపీతో బీఆరెస్ కు పొత్తు ఉండదు కేటీఆర్
నిజాన్ని నిర్భయంగా రాసే పత్రిక నినాదం

విద్యుత్ షాక్ తో వ్యక్తికి తీవ్ర ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు..…

ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు..

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నామని కుటుంబ సభ్యుల వెల్లడి…

జమ్మికుంట, ఆగస్టు 28 (నినాదం న్యూస్)
జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో వేల్పుల తిరుపతి (42) అనే యువకుడు సోమవారం ఉదయం విద్యుత్ షాక్ కు గురైనట్లు తిరుపతి కుటుంబ సభ్యులు తెలిపారు . వివరాల్లోకి వెళితే మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన వేల్పుల తిరుపతి ఎప్పటిలాగే తన పొలానికి నీరు పెట్టడానికి కరెంటు బావి దగ్గరికి వెళ్లగా కరెంటు బోర్డు నుండి ఒక ఇనుప తీగ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి ఏర్పడకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ వైరును వేయగా అవి గమనించని తిరుపతి మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా వెంటనే స్థానికులు జమ్మికుంట పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ వద్ద కుటుంబ తిరుపతి సభ్యుల రోదనలు కంటతడిపిస్తున్నాయి. హాస్పిటల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఇప్పుడే ఏమి చెప్పలేమని వారు తెలిపారు.

ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు.
వేల్పుల తిరుపతికి కరెంట్ షాక్ తలగడం పై కుటుంబ సభ్యులు గ్రామస్తులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులతో తనకు ప్రాణ భయం ఉన్నట్లు నన్ను ఎప్పుడైనా వారు చంపవచ్చునని ఆదివారం సాయంత్రం కూడా తన సన్నిహితుల వద్ద తిరుపతి వాపోయినట్లు కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ విషయంపై పోలీసు వారు పూర్తిగా దృష్టి సారించి కేసును చేదించాలని వారు కోరుకున్నారు. తిరుపతికి వ్యక్తిగతంగా ఎవరితో తగాదాలు లేవని అందరితో కలిసిమెలిసి ఉండే మంచి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా గ్రామంలో గుర్తింపు ఉన్నది కావాలని కొంతమంది తిరుపతిని హత్య చేయడానికి ఈ పన్నాగం పన్నినట్లు కరెంటు వైర్లు అమర్చిన తీరు తెలుస్తుంది తిరుపతి అదృష్టం బాగుండి బ్రతికి బయటపడాలని గ్రామస్తులు కుటుంబ సభ్యులు స్నేహితులు కోరుకుంటున్నారు.