HomeNational

‘చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలి, పార్లమెంటులో తీర్మానం చేయాలి’

‘చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలి, పార్లమెంటులో తీర్మానం చేయాలి’

''చంద్రుడిని 'హిందూ రాష్ట్రం'గా ప్రకటించండి, చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండింగ్ సైట్‌ను దాని రాజధానిగా ప్రకటించండి'' ఇవీ అఖిల భారత హిందూ మహాసభ జా

నోరు మూసుకోక పోతే ఇంటికి ఈడీని పంపుతా – విపక్షాలకు కేంద్ర మంత్రి హెచ్చరిక‌
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్దరణ … సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు
దేశ‌ద్రోహం చట్టం రద్దు, మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడితే ఉరి శిక్ష

”చంద్రుడిని ‘హిందూ రాష్ట్రం’గా ప్రకటించండి, చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండింగ్ సైట్‌ను దాని రాజధానిగా ప్రకటించండి” ఇవీ అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు, విపరీతమైన వ్యాఖ్యలకు కుఖ్యాతి పాలైన స్వామి చక్రపాణి మహారాజ్ అసాధారణ డిమాండ్లు.
ఇతర మతాల కంటే ముందు చంద్రుడిపై తన యాజమాన్యాన్ని భారత ప్రభుత్వం ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్లమెంటు తీర్మానాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు.

గత వారం చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇస్రో , చంద్రయాన్-3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత, ల్యాండర్ తాకిన ప్రదేశాన్ని ‘శివశక్తి పాయింట్’గా పిలుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్న చక్రపాణి మహారాజ్, “ఏ ఉగ్రవాది” అక్కడికి చేరుకోకుండా భారత ప్రభుత్వం త్వరగా చర్య తీసుకోవాలని అన్నారు.

చంద్రుడిని హిందూ సనాతన్ దేశంగా పార్లమెంటు ప్రకటించాలని, చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రదేశాన్ని రాజధానిగా ‘శివశక్తి పాయింట్’గా అభివృద్ధి చేయాలని, తద్వారా జిహాదీ మనస్తత్వం ఉన్న ఏ ఉగ్రవాది అక్కడికి చేరుకోకూడదని వీడియోలో పేర్కొన్నాడు.
చక్రపాణికి విచిత్రమైన విన్యాసాలు కొత్తేమీ కాదు. 2020 లో, దేశం కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్నప్పుడు, అతను దేశ రాజధానిలో “గోమూత్ర పార్టీ”ని నిర్వహించాడు, అక్కడ అతను, అతని తోటి అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు వ్యాధిని నివారించడానికి ఆవు మూత్రం తాగారు.

“జంతువులను చంపి తినే వ్యక్తుల కారణంగానే కరోనా వైరస్ వచ్చింది. మీరు ఒక జంతువును చంపినప్పుడు, అది ఆ ప్రదేశంలో విధ్వంసం కలిగించే ఒక విధమైన శక్తిని సృష్టిస్తుంది” అని ఆ ఈవెంట్‌లో ఆయన అన్నారు.

“వారు (ప్రపంచ నాయకులు) భారతదేశం నుండి ఆవు మూత్రాన్ని దిగుమతి చేసుకోవాలి, ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఏ విదేశీ జాతిలోనూ ఉండడు, భారతీయ ఆవులో మాత్రమే ఉంటాడు ” అని అన్నాడు.

2018లో కేరళలో వినాశకరమైన వరదల సమయంలో చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్రంలో గొడ్డు మాంసం తినే వారికి ఎలాంటి సహాయం చేయకూడదని అన్నారు.