HomeTelanganaCrime

హైదరాబాద్ సిటీ కమిషనర్ సంచలన నిర్ణయం – పంజాగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం ఒకేసారి ట్రాన్స్ ఫర్

హైదరాబాద్ సిటీ కమిషనర్ సంచలన నిర్ణయం – పంజాగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం ఒకేసారి ట్రాన్స్ ఫర్

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చెందిన మొత్తం సిబ్బందిని ఒకే సారి ట్రాన్స్ ఫర్

మెట్రో రైలు కొత్త మార్గాలు ఖరారు – ఆమోదం తెలిపిన రేవంత్ రెడ్డి
నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం – తొమ్మిది మంది సజీవ దహనం
హైదరాబాద్ లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ – 50 మందికి గాయాలు

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చెందిన మొత్తం సిబ్బందిని ఒకే సారి ట్రాన్స్ ఫర్ చేశారు. ఇన్ స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు మొత్తం 85 మంది సిబ్బందిని హైదరాబాద్ సీపీ బదిలీ చేశారు. వీరందరినీ సిటీ ఆర్మ్ డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి వ్యవహారంతో పాటు పలు కీలక విషయాలు లీక్ కావడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లోని మాజీ ప్రభుత్వ అధికారులకు సమాచారం చేరవేసినట్లు ఆరోపణల నేపథ్యంలో సిబ్బంది అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు కొత్త సిబ్బందిని సీపీ కేటాయించారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల నుంచి పంజాగుట్ట పీఎస్‌కు కొత్త సిబ్బందిని నియమించారు.ఒకే పోలీస్ స్టేషన్ నుంచి 85 మంది సిబ్బంది బదిలీ కావడం ఇదే తొలిసారి.