HomeTelanganaPolitics

దుబాయ్ పర్యటన‌లో రేవంత్, శ్రీధ‌ర్ బాబు

దుబాయ్ పర్యటన‌లో రేవంత్, శ్రీధ‌ర్ బాబు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం దావోస్, లండన్ పర్యటన ముగించుకుని ఆదివారం దుబాయ్ వెళ్ళ‌నున్నారు. దుబాయ్‌లోని కొన్ని అగ్రశ్రేణి కంపెనీల అధి

కాంగ్రెస్, సీపీఐ పొత్తు పొడిచింది
కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?
ఇకపై నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు – రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం దావోస్, లండన్ పర్యటన ముగించుకుని ఆదివారం దుబాయ్ వెళ్ళ‌నున్నారు. దుబాయ్‌లోని కొన్ని అగ్రశ్రేణి కంపెనీల అధిపతులతో ఆయన సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ఆదివారం జెడ్డాకు వెళ్ళ‌నున్నారు. ఆయనతో పాటు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ ఇ.విష్ణు వర్ధన్ రెడ్డి, జెడ్డాలోని కొన్ని అగ్రశ్రేణి కంపెనీల అధిపతులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

శ్రీధర్ బాబు SEDCO క్యాపిటల్స్ (ఒక పెట్టుబడి సంస్థ), జెడ్డా ఛాంబర్స్, వలీద్ ఖలీద్ ఫటానా, గ్రూప్ CEO Savola గ్రూప్ (ఆహార ఉత్పత్తులు), CEO సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ (SBCC), Petromin’s కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమవుతారు. Mazen Batterjee పరిశ్రమ సందర్శన, బాటర్జీ హోల్డింగ్ కంపెనీ , ఎనర్జీ కంపెనీ అరామ్‌కో ఛైర్మన్ లకు శ్రీధర్ బాబు కలుసుకుంటారు. వివిధ రంగాలలో పెట్టుబడులకు తెలంగాణనే గమ్యస్థానంగా చెప్పేందుకు “ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ” రోడ్‌షోలో శ్రీధర్ బాబు పాల్గొంటారు.