HomeTelanganaInternational

తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ లో రేవంత్ బిజీబిజీ

తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ లో రేవంత్ బిజీబిజీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటనలో రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించారు. రాష్ట్రానికి పెద్ద మొత

కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?
రేవంత్ రెడ్డి లాంటి వారిని ఎంతో మందిని మట్టికరిపించాం, ఆయనో లెక్కా -కేటీఆర్
ఇది ఎన్నో సారో ? కోమటి రెడ్డి మళ్ళీ అలిగారు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటనలో రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. ఈ క్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అధ్యక్షుడు బొర్గేబ్రెండెతో సమావేశమై, మనుషుల జీవన శైలి పరిస్థితులను మెరుగుపరచేందుకు ప్రభుత్వాలు, వాణిజ్య సంస్థలు, ఇతర భాగస్వాములు ఉమ్మడిగా పనిచేయడంపై చర్చించారు. మరోవైపు ఇథియోపియో డిప్యూటీ ప్రధానమంత్రి డెమెకే హసెన్‌ను కూడా కలిసి, తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలను వివరించారు. మరోవైపు ఇథియోపియో డిప్యూటీ ప్రధానమంత్రి డెమెకే హసెన్‌ను కూడా కలిసినట్టుగా సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన పంచుకున్నారు.

దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు అధికారులు ఉన్నారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో రేవంత్ రెడ్డి జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నారు. జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు చేరారు.