HomeTelanganaPolitics

రేవంత్ రెడ్డి లాంటి వారిని ఎంతో మందిని మట్టికరిపించాం, ఆయనో లెక్కా -కేటీఆర్

రేవంత్ రెడ్డి లాంటి వారిని ఎంతో మందిని మట్టికరిపించాం, ఆయనో లెక్కా -కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి లాంటి వారిని ఎంతోమందిని చూసిందని, పాతికేళ్ళుగా ఎంతోమందిని మట్టికరిపించిందిని బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నార

‘బీజేపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా’
దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టిన వజ్రోత్సవాలు
మల్కాజీగిరి ఎంపీగా పోటి చేయడానికి పట్టుబడుతున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి లాంటి వారిని ఎంతోమందిని చూసిందని, పాతికేళ్ళుగా ఎంతోమందిని మట్టికరిపించిందిని బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ”మా పార్టీని 100 మీటర్ల లోతున పాతి పెట్టడం మాట పక్కనపెట్టి… ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేయడంపై దృష్టి సారించండి” అని ఆయన సూచించారు. తెలంగాణ భవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గాల నేతలతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండున్నర దశాబ్దాలుగా బీఆర్ఎస్ జెండా రేవంత్ రెడ్డి లాంటి వారిని మట్టి కరిపించిందన్నారు. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావ్? తెలంగాణ తెచ్చినందుకా? తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? లేకుంటే మిమ్మల్ని.. మీ దొంగ హామీలను ప్రశ్నించినందుకా? అని నిలదీశారు.

లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసిపోవడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఏక్‌నాథ్ షిండే కావడం గ్యారెంటీ అన్నారు. ఆయన రక్తమంతా బీజేపీదేనని… ఇక్కడ ఆయన చోటా మోడీలా మారారని వ్యాఖ్యానించారు. అదానీ, రేవంత్ రెడ్డిల ఒప్పందాల అసలు గుట్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు.