HomeTelangana

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ముందు నిరుద్యోగుల ధర్నా

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ముందు నిరుద్యోగుల ధర్నా

ఈ మధ్య సోషల్ మీడియా లో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ముందు నిరుద్యోగులు నిరసన చేపట్టారు. GO 46కి వ్యతిరేకంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి ని

BJP, BRS, MIM ల మధ్య సీట్ల ఒప్పందం జరిగిందా ?
రేవంత్ రెడ్డి లాంటి వారిని ఎంతో మందిని మట్టికరిపించాం, ఆయనో లెక్కా -కేటీఆర్
గద్దర్ మృతికి ప్రముఖుల సంతాపం

ఈ మధ్య సోషల్ మీడియా లో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ముందు నిరుద్యోగులు నిరసన చేపట్టారు. GO 46కి వ్యతిరేకంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి నిరుద్యోగ యువకులు నగరంలోని మాదాపూర్ లో ఆమె ఫుడ్ స్టాల్ ముందు నిరసనకు దిగారు.
ట్రాఫిక్ సమస్యల వల్ల‌ రాయదుర్గం పోలీసులు కుమారి ఆంటీ స్టాల్ మూసివేయడంతో వెంటనే జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి కుమారి తన స్టాల్ కార్యకలాపాలను అంతరాయం లేకుండా తిరిగి ప్రారంభించడానికి అనుమతించాలని పోలీసు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) అధికారులను ఆదేశించారు.

కాగా, ఆరు నెలలుగా తమ నిరసనను పట్టించుకోని సీఎం , కుమారి విషయంలో తక్షణమే చర్యలు తీసుకున్నారని నిరుద్యోగ యువత పేర్కొన్నారు.

తెలంగాణలోని గ్రామీణ జిల్లాలకు చెందిన పోలీసులపై జిఓ 46 తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళనకారులు ఆరోపించారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హత కలిగిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) ఉద్యోగాలకు అర్హత పరిమితులను ఎదుర్కొంటారు.

ఉమ్మడి హైదరాబాద్‌ జిల్లాలకు 53 శాతం, మిగిలిన 26 జిల్లాలకు 47 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అవకాశాలు తక్కువగా ఉండడంతో ఉద్యోగ అసమానతలు తెరపైకి వస్తున్నాయని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.