HomeTelanganaPolitics

తెలంగాణలో కుల గణనకు ముఖ్యమంత్రి ఆదేశం

తెలంగాణలో కుల గణనకు ముఖ్యమంత్రి ఆదేశం

తెలంగాణ లో కుల గణన నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఈ రోజు ఆదేశించారు.మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ శాఖలకు

కారు సర్వీసింగుకు వెళ్ళింది, మరింత స్పీడ్ గా వస్తుందన్న‌ కేటీఆర్
ఇకపై నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు – రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
కాంగ్రెస్ లో టిక్కెట్ల చిచ్చు: రేవ‍ంత్, ఉత్తమ్ వాగ్వివాదం… కోపంతో వెళ్ళిపోయిన ఉత్తమ్

తెలంగాణ లో కుల గణన నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఈ రోజు ఆదేశించారు.
మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించిన సమస్యలపై సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి , కుల గణన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు కుల గణనను నిర్వహిస్తామని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 9 నవంబర్ 2023న కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
గతంలో, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో, దేశవ్యాప్తంగా కుల గణనను నిర్వహించాలని తీర్మానం చేసింది.

ముఖ్యమంత్రి తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు:

బిపిఎల్ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు వారి వివాహ సమయంలో లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఒక తులం బంగారం అందించే “కళ్యాణమస్తు” పథకం అమలు కోసం బడ్జెట్ అంచనాలను సిద్ధం చేయాలని సిఎం అధికారులను కోరారు.

ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన నిధులపై అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల వివరాలు అందించాలని, సొంత భవనాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా అంచనా వేయాలని సూచించారు.

ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గంలో వెనుకబడిన తరగతుల కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదనలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలను విడివిడిగా ఏర్పాటు చేయకుండా ‘ఇంటిగ్రేటెడ్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌’ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇది మెరుగైన నిర్వహణకు, పర్యవేక్షణకు సహాయపడుతుందని ప్రకటనలో తెలిపారు.