HomeNationalCrime

బాలుడి ప్రాణాలు తీసిన తల్లితండ్రుల మూఢనమ్మకం… గంగలో ముంచి చంపేశారు

బాలుడి ప్రాణాలు తీసిన తల్లితండ్రుల మూఢనమ్మకం… గంగలో ముంచి చంపేశారు

సైన్స్, టెక్నాలజీ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ మూఢనమ్మకాలు ఇప్పటికీ మనిషిని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మూఢ నమ్మకాలు ఒక్కో సారి ప్రాణాలనే బలిపెడుత

మనిషిని చంపేసిన రోబో
గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్ – ఐపీఎస్ సజ్జన్నార్
గద్దర్ కన్నుమూత‌

సైన్స్, టెక్నాలజీ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ మూఢనమ్మకాలు ఇప్పటికీ మనిషిని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మూఢ నమ్మకాలు ఒక్కో సారి ప్రాణాలనే బలిపెడుతున్నాయి. జీవితాలను విచ్చిన్నం చేస్తున్నాయి. ఐదేళ్ళ పసివాని ప్రాణాన్ని బలిపెట్టిన ఒళ్ళు జలదరించే సంఘటన ఇది.

బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 5 ఏళ్ల బాలుడిని గంగానదిలో ముంచి చంపేశారు కన్న తల్లి తండ్రులు , ఇతర కుటుంబ సభ్యులు. గంగలో పవిత్ర స్నానం చేయిస్తే బ్లడ్ క్యాన్సర్ నయమవుతుందని నమ్మిన అతని తల్లిదండ్రులు, అత్త హరిద్వార్‌లో దాదాపు 15 నిమిషాల పాటు గంగలో పదేపదే ముంచడం వల్ల బాలుడు మరణించాడు.

నివేదికల ప్రకారం, ఢిల్లీకి చెందిన బాలుడు నీటిలో చాలా సేపు మునిగి చనిపోయి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
బాలుడిని తల్లి, అత్త నీటిలో ముంచుతుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి బాలుడిని నీటిలో నుండి బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు వారిద్దరూ హింసాత్మకంగా ప్రతిస్పందించడం కనిపిస్తుంది. మరొక‌ వీడియోలో, బాలుడి అత్త అతని శరీరం పక్కన కూర్చొని, పిల్లవాడు “మళ్లీ ప్రాణం పోసుకుంటాడు” అని చెప్తున్నది.

హరిద్వార్ నగర పోలీసు చీఫ్ స్వతంత్ర కుమార్‌ను ఉటంకిస్తూ, ఎన్‌డిటివి నివేదిక ప్రకారం, బాలుడు ఢిల్లీలోని ఒక ఉన్నత ఆసుపత్రిలో క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారని, అక్కడ వైద్యులు బాలుడిని రక్షించలేమని చెప్పారని , ఇక‌ గంగా నది బాలుడిని నయం చేయగలదని కుటుంబ సభ్యులు విశ్వసించి ఆ నదిలో ముంచారని తెలిసింది.