HomeNationalCrime

నిన్న అయోద్యలో రెచ్చిపోయిన జేబు దొంగలు

నిన్న అయోద్యలో రెచ్చిపోయిన జేబు దొంగలు

నిన్న అయోద్యలో జేబుదొంగల పంటపండింది. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వచ్చిన భక్తులను జేబుదొంగలు టార్గెట్ చేశారు. భారీ జనసమూహం

అయోద్యలో 14.5 కోట్లతో ప్లాట్ కొన్న అమితాబ్
ఆలయంలోకి వెళ్ళకుండా రాహుల్ గాంధీని అడ్డుకున్న అధికారులు…రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపిన రాహుల్
జనవరి 22న రాముడు అయోద్యకు రావడంలేదని నాతో చెప్పాడు

నిన్న అయోద్యలో జేబుదొంగల పంటపండింది. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వచ్చిన భక్తులను జేబుదొంగలు టార్గెట్ చేశారు. భారీ జనసమూహం రావడం అవకాశంగా చేసుకుని జేబుదొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఈ ఘటనలపై భద్రతా సిబ్బంది దృష్టి పెట్టాలి. భక్తులను జేబుదొంగల నుండి రక్షించడానికి చర్యలు తీసుకోవాలి.

అయోధ్య వీధుల్లో ఏర్పడిన రద్దీని అవకాశంగా ఉపయోగించుకున్న జేబుదొంగలు… హ్యాండ్ బ్యాగులను, జేబులను లక్ష్యంగా చేసుకుని యధేచ్ఛగా తమ పనితనాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా, రామ మందిరంలోకి ప్రవేశించే గేట్ల వద్ద భారీ జనసమూహాలు గుమికూడడంతో, జేబుదొంగల పని బాగా సులువైంది.

గత రాత్రి నుంచి ఆలయ ప్రవేశం కోసం వేచి ఉన్న భక్తులు, నిన్న ఉదయం 7 గంటలకు గేట్లు తెరిచేసరికి ఒక్కసారిగా తోసుకుని వచ్చారు. ఇదే అదనుగా జేబుదొంగలు విజృంభించారు.

కెనడా నుంచి వచ్చిన పూర్ణిమ అనే భక్తురాలు తన హ్యాండ్ బ్యాగులో విలువైన వస్తువులు, డబ్బు పోయిన విషయం గుర్తించి లబోదిబోమన్నారు. ఆమె స్నేహితురాలు ప్రాప్తి కూడా జేబుదొంగల బాధితురాలయ్యారు.

స్నేహితురాలికి తోడుగా అయోధ్య వచ్చిన ప్రాప్తి కూడా విలువైన వస్తువులు పోగొట్టుకున్నారు. ఆమె స్లింగ్ బ్యాగ్ జిప్ తెరిచిన జేబుదొంగలు ఏటీఎమ్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలను ఎత్తుకెళ్లారు. వీళ్లిద్దరే కాదు… అయోధ్యలో నిన్న అనేక మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు.