HomePoliticsAndhra Pradesh

దూకుడు పెంచిన వైఎస్ షర్మిల

దూకుడు పెంచిన వైఎస్ షర్మిల

ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఆమె ముందడుగు వేస్తున

ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరిన షర్మిల, కేవీపీ, రఘువీరారెడ్డి
ఈ నెల 21న ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల‌
జగన్ రెడ్డీ…అంటూ అన్నపై నిప్పులు చెరిగిన షర్మిల‌

ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఆమె ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది పాత కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపిన షర్మిల వారిని మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ అభిమానులందరితో ఆమె మాట్లాడుతున్నారు. వైఎస్ ఆసయం నెరవేరాలంటే జగన్ తో సాధ్యం కాదని ఆమె వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ఆమెకు వైఎస్ ఆత్మగా పేరు గాంచిన కేవీపీ రాంచందర్ రావు అండగా నిలబడ్డారు. ఆయన కూడా అనేక మంది సీనియర్ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు.

మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. కొత్త, పాత తరం నేతల కలయికతో పార్టీని బలోపేతం చేయాలని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె రేపటి నుంచి జిల్లాల యాత్రను చేపడుతున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది.

షర్మిల జిల్లాల పర్యటన షెడ్యూల్:
జనవరి 23: శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లా
జనవరి 24: విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జల్లాలు
25వ తేదీ: కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు
26వ తేదీ: తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు
27వ తేదీ: కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు
28వ తేదీ: బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు
29వ తేదీ: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు
30వ తేదీ: శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు
31వ తేదీ: నంద్యాల, కడప జిల్లాలు.
అదే రోజు ఆమె ఇడుపులపాయ చేరుకోవడంతో జిల్లాల పర్యటన ముగుస్తుంది.