HomeTelanganaPolitics

షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్ లో ఎడమొహ పెడమొహంగా జగన్, షర్మిల‌

షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్ లో ఎడమొహ పెడమొహంగా జగన్, షర్మిల‌

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడిగినా మూవీ చేయను , నేను జగన్ అభిమానిని… ఆర్జీవీ
వర్మ మళ్ళీ గెలికాడు… అచ్చుగుద్దినట్టు పవన్ ను దించేశాడు
గద్దర్ మృతికి ప్రముఖుల సంతాపం

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్ శివారు గండిపే­టలోని గోల్కొండ రి­సార్ట్స్ లో జరిగిన ఈ వేడుక కోసం జగన్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. వేడుక వద్దకు రోడ్డు మార్గంలో వచ్చిన సీఎం జగన్‌ దంపతులు కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఆ కార్యక్రమంలో జగన్ దంపతులు పది నిమిషాలు కూడా ఉండకుండానే తిరిగి విజయవాడ వెళ్ళిపోయారు.

జగన్ వచ్చిన సందర్భంగా అన్నా చెల్లేళ్ళ మధ్య ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. కలవడానికి జగన్ ప్రయత్నించినప్పటికీ షర్మిల ఆయనను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ కాబోయే వధూవరుల వద్దకు వచ్చి ఆశీర్వదిస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఫోటో దిగే సందర్భంలో జగన్ తన బావ బ్రదర్ అనిల్ ను, సోదరి షర్మిలను తన పక్కకు పిలుస్తుండగా.. వారు రాలేదు. జగన్ పదే పదే తన పక్కకు రావాలని సైగ చేస్తున్నప్పటికీ షర్మిల అక్కడికి వెళ్లలేదు.దీంతో షర్మిల, బ్రదర్ అనిల్ దూరంగా ఉంటూ ఫోటోల్లో కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాల విషయం మరోసారి తెరపైకి వచ్చింది.  జగన్ వేదిక వద్దకు వచ్చిన సందర్భంలో మాత్రం.. షర్మిల ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. ఫోటో కోసం జగన్ పిలిచినా షర్మిల వెళ్ళని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.