HomeNationalCrime

దొంగను నడుస్తున్న రైలు బైట వేలాడదీసిన ప్రయాణీకులు

దొంగను నడుస్తున్న రైలు బైట వేలాడదీసిన ప్రయాణీకులు

రైలు వెళ్తుండగా కిటికీ బైట ప్రాణాలు అరచేతిలోపెట్టుకొని వెళాడుతున్న ఓ దొంగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.బీహార్ లోని బగల్పూర్ లో రైలు ప్లాట్ ఫా

హైదరాబాద్ సిటీ కమిషనర్ సంచలన నిర్ణయం – పంజాగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం ఒకేసారి ట్రాన్స్ ఫర్
‘తోటి విద్యార్థులను కులము, మార్కులు అడగొద్దు’
ముచ్చట తీరకముందే తెల్లవారిన బతుకులు:ఆరుగురు స్పాట్ డెడ్

రైలు వెళ్తుండగా కిటికీ బైట ప్రాణాలు అరచేతిలోపెట్టుకొని వెళాడుతున్న ఓ దొంగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బీహార్ లోని బగల్పూర్ లో రైలు ప్లాట్ ఫార్మ్ మీద ఉన్నప్పుడుఓ దొంగ రైలు కిటికీ లోపలికి చేయిపెట్టి ఓ ప్రయాణీకుడి ఫోన్ చోరీ చేయడానికి ప్రయత్నించాడు. అయితే అప్రమత్తమైన ప్రయాణీకుడు దొంగ చేయి పట్టుకున్నాడు. ఇంతలో మిగతా ప్రయాణీకులు కూడా ఆ దొంగ చేయి గట్టిగా పట్టుకున్నారు. ఇంతలో రైలు కదిలింది. అలా రైలు ఓ కిలో మీటరు దూరం ప్రయాణించినంతవరకు ఆ దొంగ కిటికీకి వేలాడుతూనే ఉన్నాడు. తప్పైందని, తనను రక్షించమని వేడుకున్నాడు.

రైలు కొంత దూరం వెళ్ళిన తర్వాత రైలు వేగం తగ్గింది. ఇంతలో ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చి అతన్ని రక్షించారు. ఆ ఇద్దరు కూడా ఆ దొంగ ముఠా సభ్యులే అనే అనుమానాలున్నాయి.