HomeCinema

‘గుంటూరు కారం’ పై ‘బుక్ మై షో’లో 70 వేల నెగెటివ్ ఓట్లు

‘గుంటూరు కారం’ పై ‘బుక్ మై షో’లో 70 వేల నెగెటివ్ ఓట్లు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమాకు నెగెటివ్ ప్రచారం చాలా డ్యామేజి చేసింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షక

“ది కాశ్మీర్ ఫైల్స్” మూవీకి అవార్డు ఇవ్వడంపై మండిపడ్డ‌ తమిళనాడు సీఎం స్టాలిన్
డ్రగ్స్ కేసు: ఐదుగురు అరెస్ట్, టాలీవుడ్ లో ప్రకంపనలు, ‘బేబీ’ మూవీ టీం కు పోలీసుల నోటీసులు
వర్మ ‘వ్యూహం’ మూవీకి షాక్ ఇచ్చిన హైకోర్టు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమాకు నెగెటివ్ ప్రచారం చాలా డ్యామేజి చేసింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనూహ్యరీతిలో నెగెటివిటీ కోరల్లో చిక్కుకుంది.

ఈ సినిమాకు నెగెటివ్ ప్రచారం చేయడానికి వ్యక్తిగత కారణాలు ఉన్నాయా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనేది స్పష్టంగా తెలియదు. అయితే, ఈ సినిమాకు వ్యతిరేకంగా నెగెటివ్ రివ్యూలు, రేటింగులు సృష్టించడం ద్వారా ప్రేక్షకులను మోసం చేయడానికి ప్రయత్నం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ చిత్రానికి వ్యతిరేకంగా ‘బుక్ మై షో’ పోర్టల్ లో నెగెటివ్ ఓట్లు వేసి తమ చిత్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని చిత్రబృందం తన ఫిర్యాదులో పేర్కొంది. 70 వేల బాట్ లను సృష్టించి రివ్యూలను తారుమారు చేసిన పరిస్థితి కనిపిస్తోందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరింది.

దీనిపై విషయంలో ఫిలిం చాంబర్ కూడా జోక్యం చేసుకుంది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో 70 వేల నెగెటివ్ రేటింగులు రావడం సాధ్యం కాదని ఫిలిం చాంబర్ పేర్కొంది. ఇది బాట్‌లను ఉపయోగించి రివ్యూలను తారుమారు చేసినట్లు స్పష్టంగా తెలియజేస్తుందని చాంబర్ అభిప్రాయపడింది.

ఈ విషయంపై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెగెటివ్ ప్రచారం వెనుక ఉన్న వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటారని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.