HomeTelanganaPolitics

ఉత్తమ్ దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నాడు-సైదిరెడ్డి

ఉత్తమ్ దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నాడు-సైదిరెడ్డి

•దమ్ము ధైర్యముంటే నాతో పోటీపడి గెలువు… •మా నాయకులను రెచ్చగొట్టేలా ఉత్తమ్ ప్రవర్తిస్తున్నాడు.. •ఓడిపోతానని భయంతోనే ఉత్తమ్ ఆరోపణలు.. •హుజూర్నగ

తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం …పోస్టర్ల హల్ చల్
హరీష్ రావు వ్యాఖ్యలతో రైతు బంధు డబ్బుల పంపిణీని నిలిపివేసిన ఈసీ
ఎన్నికల్లో బీఆరెస్సే గెలుస్తుందని చెప్పేసిన బండి స‍ంజయ్

•దమ్ము ధైర్యముంటే నాతో పోటీపడి గెలువు…

•మా నాయకులను రెచ్చగొట్టేలా ఉత్తమ్ ప్రవర్తిస్తున్నాడు..

•ఓడిపోతానని భయంతోనే ఉత్తమ్ ఆరోపణలు..

•హుజూర్నగర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి…

హుజూర్నగర్,నవంబర్ 22
(నినాదం న్యూస్):
కిడ్నాప్ కట్టు కథలలతో..ఉత్తమ్ దగుల్భాజీ రాజయాలు చేస్తున్నారని..తన లాగా ప్యాకేజీ రాజకీయాలు బెదిరింపు రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని..జనం కోసం..నా హుజూర్‌నగర్ కోసం స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నా అని స్పష్టం చేశారు.నిన్న రాత్రి ఎమ్మెల్యే సైదిరెడ్డి సర్వే ప్రతినిధులను కిడ్నాప్ చేశారాని..పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ..ఎమ్మెల్యే సైదిరెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కౌంటర్ ఇచ్చారు.
సమావేశంలో ఎమ్మెల్యే తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సైదిరెడ్డి గురించి ప్రతి ఒక్కరికి తెలుసునని నీలాగా మా పార్టీ నాయకులు ఫోన్ చేసి మీ సంగతి చూస్తా.. రేపు అధికారంలోకి వచ్చేది మేమే ..గుర్తుపెట్టుకుంటా మీ సంగతి చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం క్యాండిడేట్ నుండి చెప్పుకుంటూ దిగజారుడు రాజకీయాలు ఉన్నానని ఆరోపించారు.మంగళవారంరాత్రి జరిగిన విషయంలో స్వామి సృజన అనే వ్యక్తులు ఒక ఏజెన్సీ పేరుతో గత మూడు నెలల నుండి తన వద్దనే సర్వేలు చేస్తూ పనిచేస్తున్నారని తెలిపారు. రాత్రి తను మీటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చే సమయంలో స్వామి టీం నెంబర్లతో కలిసి ఉన్నారని ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగగా టీం మీటింగ్ పెడుతున్నాం సార్ అన్నారని తెలిపారు. గత నాలుగు రోజులు క్రితం గ్రూప్ సభ్యులను తన వద్దకు తీసుకొస్తానని తెలిపారని అన్నారు. నా వద్దకి వస్తున్నాడని కారు ఆపి కారులో ఎక్కించుకొని ఇంటికి వెళ్లానని అలాగే అక్కడి నుండి మరోక వ్యక్తిని కలిసేందుకు వెళ్తుండగా మన వాడే అనుకొని ఆయనను కూడా వెంట తీసుకుని వెళ్లానని తెలిపారు. తీరా అతనితో మాట్లాడగా నాకు ఒక విషయం అర్థమైందని స్వామి అనే వ్యక్తి నాతోపాటు ఉత్తంకుమార్ రెడ్డి కూడా సర్వే చేస్తున్నట్లు తెలిసిందన్నారు. తమ దగ్గర పనిచేసి ఉత్తమ్ తో చేతులు కలిపి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని గుర్తించానన్నారు.ఆ ఏజెన్సీకి చెందిన వారు మాకు, ఉత్తమ్ కు ఇరువురుకు పనిచేయడం వల్ల ఒకరికి రిపోర్టు మరొకరికి ఇచ్చిమాకు వారికి గొడవలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని గుర్తించి సర్వే ఆపి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పానని అన్నారు. కానీ దీనిని కొందరు కిడ్నాప్ గా డ్రామా ఆడుతున్నారని అలాంటి నీచ రాజకీయాలు నేను చేయనని స్పష్టం చేశారు. మాకు ఏజెన్సీకి తమకు సంబంధించిన ఫోన్ కాల్స్ చాటింగ్ మెసేజ్లు తో పాటు నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు. దీన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని ఇలాంటి నీచ రాజకీయాలు సంస్కృతిని మానుకోవాలని నేనెప్పుడూ రాజకీయాలలో నీతిగా పనిచేస్తానని .. నీలా ప్యాకేజీ రాజకీయాలు చేయడం నాకు చేతకాదని ఉత్తమును ఉద్దేశించి వ్యాఖ్యానించారు . కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటమి భయంతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారని కానీ బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో ఓపిక పట్టాలని అని అన్నారు. వచ్చేది మన బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు హుజూర్నగర్ పట్టణంలో కేటీఆర్ రోడ్ షో ప్రోగ్రామ్ ఉంటుందని ఈ ప్రోగ్రాం కి మండలాల్లోని అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు నాయకులు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.