HomeTelanganaCrime

డ్రగ్స్ వ్యవహారం: హీరో నవదీప్ కు ఈడీ నోటీసులు

డ్రగ్స్ వ్యవహారం: హీరో నవదీప్ కు ఈడీ నోటీసులు

హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం ఎప్పుడు తెరపైకి వచ్చినా టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తాయి. ఈ డ్రగ్స్ వాడకం, అమ్మకంలో టాలీవుడ్ లో పలువురు ప్రముఖుల హస్త

ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు
జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరెన్‌
‘కవితకు ఈడీ నోటీసులు పెద్ద డ్రామా’

హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం ఎప్పుడు తెరపైకి వచ్చినా టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తాయి. ఈ డ్రగ్స్ వాడకం, అమ్మకంలో టాలీవుడ్ లో పలువురు ప్రముఖుల హస్తం ఉందని ఎప్పటికప్పుడు పోలీసు విచారణలో తేలుతూనే ఉంది. అయినా మళ్ళీ, మళ్ళీ ఈ వ్యవహారంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ వ్యవహారం నుంచి బైటికి రావడం లేదు.

తాజాగా టాలీవుడ్ హీరో నవదీప్ ను గత నెల 23న మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ పోలీసులు 6 గంటల పాటు విచారించారు. ఆయనపై కేసు కూడా నమోదయ్యింది. ఇప్పుడు ఆయనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ED నోటీసులు జారీ చేసింది.

డ్రగ్స్ కేసులో నవదీప్ ను విచారణకు హాజరుకావాల్సిందిగా ED రెండు సార్లు నోటీసులు పంపినా ఆయన పట్టి౦మ్చుకోకపోవడంతో ED మరో సారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన తమ ముందు విచారణకు హాజరుకావాలని ED అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు. నైజీరియన్ డ్రగ్స్ ముఠాతో నవదీప్ కు సంబంధాల విషయంలో ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు.