HomeNationalCrime

కుకీ, కేంద్రం శాంతి ఒప్పందానికి డేట్ ఫిక్స్ కాగానే మణిపూర్ లో హింస రేగడానికి కారణమెవరు ?

కుకీ, కేంద్రం శాంతి ఒప్పందానికి డేట్ ఫిక్స్ కాగానే మణిపూర్ లో హింస రేగడానికి కారణమెవరు ?

కుకీ తిరుగుబాటు గ్రూపులతో శాంతి ఒప్పందాన్ని మే 8న ఖరారు చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) సిద్ధమైందని, అయితే మణిపూర్‌లోని చురచంద్‌పూర్-బిష్

ప్రభుత్వాల చర్చల పిలుపు మోసపూరితమైనది, అయినా మేము సిద్దమే! అయితే…. మావోయిస్టు పార్టీ ప్రకటన‌
దేశ‌ద్రోహం చట్టం రద్దు, మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడితే ఉరి శిక్ష
మోడీ తర్వాత ప్రధాని అమిత్ షానే యోగికి నో ఛాన్స్

కుకీ తిరుగుబాటు గ్రూపులతో శాంతి ఒప్పందాన్ని మే 8న ఖరారు చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) సిద్ధమైందని, అయితే మణిపూర్‌లోని చురచంద్‌పూర్-బిష్ణుపూర్ సరిహద్దులోని టోర్‌బంగ్ ప్రాంతంలో మే 3న హింసాత్మక ఘటనలు చెలరేగాయని ప్రముఖ వెబ్ పోర్టల్ ది వైర్ పేర్కొంది. ఒప్పందంజరగడానికి సరిగ్గా 5 రోజుల ముందు హింస చెలరేగి ఇప్పటి వరకు ఆగడం లేదు.

నరేంద్ర మోడీతో జరుగుతున్న శాంతి చర్చల ఫలితంగా వచ్చిన ఒప్పందాన్ని లాంఛనప్రాయంగా సంతకాలు చేయడానికి కుకీ కమ్యూనిటీకి చెందిన సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (SoO) గ్రూపుల నాయకులను న్యూఢిల్లీకి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నామని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ MHA వర్గాలు వైర్ ప్రతినిధికి తెలిపాయి.

కుకీ తిరుగుబాటు గ్రూపునకు చెందిన‌ ఒక అజ్ఞాత నాయకుడు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ MHA చెప్పిన‌ సమాచారాన్ని ధృవీకరించారు. “అవును, మేము దాదాపు ఒక ఒప్పందానికి చేరుకున్నాము; ఆ ఒప్పందం యొక్క పద్ధతులు మా డిమాండ్ అయిన రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ తరహాలో ఉండాలి. అస్సాంలోని బోడోల మాదిరిగానే ఆరవ షెడ్యూల్‌లో స్వయంప్రతిపత్తిగల ప్రాదేశిక మండలిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంగీకరించింది. ఇది మా రాజకీయ ఉద్యమానికి గణనీయమైన విజయంగా ఉండేది. ఇంఫాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటే, అది దాదాపు ప్రత్యేక రాష్ట్రాన్ని కలిగి ఉంటుంది, ”అని అతను ది వైర్‌తో అన్నారు. అయితే, తిరుగుబాటు నాయకుడు, “మే 3 హింసాకాండ తర్వాత ప్రజలు ప్రాంతీయ మండలిని ఒప్పుకోవడంలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలలో బలమైన డిమాండ్ ఉంది, కాబట్టి మా వైఖరి కూడా మారుతోంది.” అన్నారు.

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మే 8న కుకీ తిరుగుబాటు గ్రూపులతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంది. అయితే ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా ఉంది. ముఖ్యమంత్రి ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేసినట్లు తెలిసింది.

అనేక మైతి Meitei పౌర సమాజ సంస్థలు (CSOలు) కుకీ-ఆధిపత్య ప్రాంతాలను ఆరవ షెడ్యూల్ క్రిందకు తీసుకురావడాన్ని వ్యతిరేకించాయి. తద్వారా కుకీలకు స్వయంప్రతిపత్త ప్రాదేశిక మండలి క్రింద “ప్రత్యేక పరిపాలన” మంజూరు చేయడం పట్ల మైతీలు మండిపడుతున్నారు. ఢిల్లీతో నేరుగా వారికి ప్రత్యేక ఆర్థిక మార్గాన్ని మంజూరు చేయడం మణిపూర్ రాష్ట్ర “ప్రాదేశిక సమగ్రతను” ప్రభావితం చేయడమేనని వారు భయపడ్డారు.

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మే 8న కుకీలతో ఈ ఒప్పందాన్ని అధికారికం చేసుకోగలిగితే, మెయితీల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చేదని. మైతీ కమ్యూనిటీకి చెందిన ఎన్ బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండటం కష్టమవుతుందని, తన ‘సొంత’ వారినుండి ఎదురుదెబ్బకు గురవుతారని, ఈ చర్య తన‌ రాజకీయ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని ఆయన భయపడ్డారని పలు వర్గాలు చెబుతున్నాయి.

మే 8న కుకీ తిరుగుబాటు గ్రూపులతో కేంద్ర ప్రభుత్వానికి జరగాల్సిన శాంతి ఒప్పందంపై రాష్ట్ర బిజెపి నాయకులు మాట్లాడేందుకు నిరాకరించారు. శాంతి ఒప్పందం గురించి తమకు తెలియదని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు.

కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, బీరేన్ సింగ్ మాజీ సహోద్యోగి, శంతి ఒప్పందం ప్రతిపాదన గురించి తనకు తెలియదని చెప్పారు. అయితే, “భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల కోసం మణిపూర్ ఔటర్ పార్లమెంటు స్థానాన్ని కూకీలకు ఆరవ షెడ్యూల్‌ను మంజూరు చేయడం ద్వారా సాధించాలని చూస్తున్నప్పటికీ, అది నేరుగా బీరెన్‌పై ప్రభావం చూపుతుంది. అతనిపై కేవలం మెయిటీ ప్రజలే కాదు, ఆయనను తొలగించడానికి అతని పార్టీలో తిరుగుబాటు మరింత బలపడి ఉండేది. కాబట్టి కేంద్రం చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఆయన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది.” అన్నారు.

“ బీరెన్‌కు శాంతి ఒప్పందంపై అంతర్గత సమాచారం ఉంది కాబట్టి; తన మద్దతుదారులైన అరంబై టెంగోల్, మెయిటీ లీపున్ వంటి రాడికల్ గ్రూపుల సహాయంతో అతను హింసను సృష్టించాడా ? ఆ గుంపులే ఇంఫాల్‌లోని కుకీలపై హింసకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.” అని ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు.

మరో వైపు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తమపై హింసకు మద్దతు ఇస్తున్నారని కుకీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిని ‘రాష్ట్ర ప్రాయోజిత’ అని పేర్కొన్నారు.

కాగా, జాతి హింస చెలరేగినప్పటి నుండి, ముఖ్యమంత్రి నిందను తిరుగుబాటుదారులపై నెట్టడానికి ప్రయత్నించారు. కుకీ కమ్యూనిటీ మయన్మార్ నుండి “అక్రమ వలసదారులకు” ఆశ్రయం ఇస్తోందని, కుకీ SoO గ్రూపులు ‘నార్కో టెర్రరిజం’లో మునిగిపోయాయని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. అయితే మే 31న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ముఖ్యమంత్రి వాదనలకు విరుద్ధమైన ప్రకటన చేశ్డారు. మణిపూర్ హింసకు తిరుగుబాటుదారుల‌తో సంబంధం లేదని, ఇది “రెండు జాతులకు చెందిన వ్యక్తులతో కూడిన వివాదం” అని అన్నారు.

రాష్ట్రంలో, వెలుపల అనేక వర్గాలు బీరెన్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా తొలగించాలని డిమాండ్ చేశాయి. పెద్ద ఎత్తున హింసకు అతని ఆధ్వర్యంలోని రాష్ట్ర పోలీసులే బాధ్యుల‌ని, వారికి ముఖ్యమంత్రి మద్దతు ఉందని ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు మోడి ప్రభుత్వం మాత్రం బీరేన్ సింగ్ కు మద్దతు ఇవ్వడంలో దృఢంగా ఉంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభలో చేసిన సుదీర్ఘ ప్రసంగంలో హోంమంత్రి అమిత్ షా సింగ్‌ను సమర్థిస్తూ మాట్లాడారు.