బీఆరెస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుడు ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంతో ఇంటిని శుభ్రం చేసు
బీఆరెస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుడు ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంతో ఇంటిని శుభ్రం చేసుకునే వ్యక్తి కేసీఆర్ అని మోత్కుపల్లి అన్నారు. తనను కేసీఆరే పిలిచి దళిత బంధు చైర్మన్ ను చేసి ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాడని విమర్శించారు.
తనకు కేసీఆర్ ఆరు నెలలుగా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారని, ఎన్టీఆర్, చంద్రబాబు దగ్గరకే ఈజీగా వెళ్లగలిగాను కానీ కేసీఆర్ మాత్రం సమయం ఇవ్వటం లేదని మోత్కుపల్లి అసహనం వ్యక్తం చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే దాదాపు 30, 40 మంది బీఆరెస్ అభ్యర్థుల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారంతా ఓడిపోవడం ఖాయమని నర్సింహులు అన్నారు.
తన మద్దతు లేకుండా నల్గొండ జిల్లాలో బీఆరెస్ ఒక్క సీటు కూడా గెలవబోదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో 30 నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్స్ గెలుపోటములను ప్రభావితం చేస్తారని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు ను కేసీఆర్ ఖండించాలని, లేదంటే బీఆరెస్సే నష్టపోతుందని ఆయన అన్నారు.