HomeTelanganaPolitics

తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి:మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి:మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్ర అ

కాంగ్రెస్, సీపీఐ పొత్తు పొడిచింది
ఎన్నికల్లో గెలుపోటములు సహజం.విర్రవీగిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు:మంత్రి పొన్నం ప్రభాకర్
‘రేవంత్ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు’

తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

       మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో ‘ఎన్ ఎక్స్ పి సెమీ కండక్టర్స్’ ప్రతినిధులతో సమావేశమైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, * సెమీ కండక్టర్స్ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను కంపెనీ ప్రతినిధులకు వివరించిన మంత్రి శ్రీధర్ బాబు.2030 నాటికి భారతదేశంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కంపెనీ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏ ఐ సిటి లో భాగస్వామ్యం కావాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. తెలంగాణలో ఉన్న ప్రతిభావంతమైన మానవ వనరులను వినియోగించుకోవాలని కంపెనీ ప్రతినిధులను కోరిన మంత్రి శ్రీధర్ బాబు, స్కిల్ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వామ్యం అయి, సెమీ కండక్టర్ల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేయాలని మంత్రి కోరారు. సెమీ కండక్టర్స్ తయారీకి సంబంధించిన ఆర్ అండ్ డి యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను ఆయన కోరారు.
హైదరాబాద్‌లోని స్టార్టప్‌లు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలతో కలిసి పని చేయాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు