HomeTelanganaPolitics

రాహుల్ గాంధీ యాత్ర కోసం మణిపూర్ వెళ్లనున్న రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ యాత్ర కోసం మణిపూర్ వెళ్లనున్న రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ యాత్ర ద్వారా, ప్రజాస్వామ్యం, న

ట్యూషన్ టీచర్ ను పొడిచి చంపిన బాలుడు
బీజేపీలోకి క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ?
బండి సంజయ్ కి కీలక పదవి – ప్రకటించిన నడ్డా

రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ యాత్ర ద్వారా, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం లాంటి అంశాలపై రాహుల్ గాంధీ ప్రజలతో సంభాషించనున్నారు.

రేపు మణిపూర్ రాష్ట్రంలోని తౌబాల్ జిల్లాలోని ఓ ప్రయివేటు స్థ‌లం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మణిపూర్‌కు వెళ్లనున్నారు. తొలి రోజు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వస్తారు. అనంతరం దావోస్‌లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సుకు వెళ్లనున్నారు.

రేవంత్ రెడ్డి ఈ రోజు ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలుసుకోనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలతోపాటు రెండు ఎమ్మెల్సీల నామినేష‌న్లపై వారితో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.