HomeCrimeInternational

ఈక్వెడార్‌లో టీవీ న్యూస్‌ ఛానల్‌పై దుండగుల దాడి – లైవ్ లో ప్రసారం

ఈక్వెడార్‌లో టీవీ న్యూస్‌ ఛానల్‌పై దుండగుల దాడి – లైవ్ లో ప్రసారం

ఈక్వెడార్‌ దేశ రాజధాని గ్వయకిల్‌లోని టీసీ టీవీ ఛానల్‌పై మంగళవారం దుండగులు దాడి చేశారు. మాస్కులు ధరించి తుపాకులు, డైనమైట్లతో బలవంతంగా ఛానల్‌ లైవ్‌ స్ట

మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులు 35 మంది కాదు నలుగురే – అధికారుల ప్రకటన‌
కాంగ్రెస్ మార్క్ గూండాయిజం: కాంగ్రెస్ గ్రూపుల మధ్య కొట్లాట – జర్నలిస్టులను చితకబాదిన కాంగ్రెస్ నేతలు
ఇకపై ప్రతి భక్తుడికి ఒక కర్ర ఇవ్వనున్న టీటీడీ … తిరుమలలో పులుల నుండి భక్తుల రక్షణకు చర్యలు

ఈక్వెడార్‌ దేశ రాజధాని గ్వయకిల్‌లోని టీసీ టీవీ ఛానల్‌పై మంగళవారం దుండగులు దాడి చేశారు. మాస్కులు ధరించి తుపాకులు, డైనమైట్లతో బలవంతంగా ఛానల్‌ లైవ్‌ స్టూడియోలోకి ప్రవేశించిన వారు ఉద్యోగుల తలకు తుపాకులు ఎక్కుపెట్టి బెదిరింపులకు దిగారు. 15 నిమిషాల పాటు టీవీ లైవ్‌లోనే తీవ్ర కలకలం సృష్టించారు.

దుండగులు తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులెవరూ ఇక్కడికి రారంటూ బెదిరించారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఛానల్‌ను చుట్టుముట్టారు. దుండగులు తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని ఉగ్రవాద చర్యల కింద వారిపై కేసు నమోదు చేశారు.

ఈ దాడి వెనుక ఎవరున్నారనే విషయం మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని పోలీసులు తెలిపారు.