HomeAndhra Pradesh

చంద్రబాబుకు ఊరట – ఒకేసారి మూడు బెయిల్స్ మంజూరు

చంద్రబాబుకు ఊరట – ఒకేసారి మూడు బెయిల్స్ మంజూరు

తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఏపీ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న పలు కేస

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర అధ్యక్షుడు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు శతృవులయ్యారా ?
చంద్రబాబును కుట్టిన దోమలు గుండెపోటుతో చనిపోతున్నాయట‌

తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఏపీ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న పలు కేసులపై విచారణ జరిగింది. ఈ విచారణలో హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒకేసారి మూడు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. IRR, మద్యం, ఉచిత ఇసుక కేసులలో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
చంద్రబాబును మళ్ళీ అరెస్టు చేద్దామనుకున్న జగన్ ప్లాన్ కు కోర్టు చెక్ పెట్టిందని తెలుగుదేశం నాయకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బాబు బెయిల్స్ లభించాయన్న వార్తతో అనేక చోట్ల తెలుగుదేశం కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు.