HomeTelanganaUncategorized

తోబుట్టువుల ప్రేమానురాగాల జల్లులో తడిసి ముద్దయిన కేసీఆర్.. ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

తోబుట్టువుల ప్రేమానురాగాల జల్లులో తడిసి ముద్దయిన కేసీఆర్.. ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికగా నిలిచింది. రా

పాపం కృష్ణ మాదిగ…అంతన్నారింతన్నారు….అద్దాల మేడన్నారు… చివరకు తుస్సుమనిపించిన మోడీ
ఉల్లిగడ్డ ధర మండిపోతోంది
‘హైదరాబాద్ ప్రజలు ఇళ్ళలోంచి బైటికి రాకండి’

రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికగా నిలిచింది.

రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి వారి అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా
అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారి అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ, తదితరులు పాల్గొన్నారు.

KCR, who was soaked in the shower of affection of his siblings

తోడబుట్టిన అన్నా చెల్లెల్లు అక్కా తమ్ముల్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ బంధన్ (రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీల పండుగ తెలియజేస్తుందని సిఎం తెలిపారు.
భారతీయ సంస్కృతికి, జీవనతాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుందని సీఎం తెలిపారు. రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని అన్నారు. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెల్లు ఆకాంక్షిస్తారని సీఎం తెలిపారు.

మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ కొనసాగుతున్నదన్నారు.
మానవీయ పాలనే లక్ష్యంగా అమలు చేస్తున్న పలు పథకాలు వృద్దులు తదితర రక్షణ అవసరమైన వర్గాలకు భరోసానందిస్తున్నాయన్నారు. సంపదను సృష్టించి సకలజనులకు పంచుతూ కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానం రాష్ట్ర ప్రజల నడుమ సహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తూ, సహోదర భావాన్ని పెంచుతున్నదని సిఎం అన్నారు .

అనేక పథకాలను అమలు చేస్తూ, మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసానందిస్తూ, పెద్దన్నలా రక్షణగా నిలిచిందని సిఎం అన్నారు. ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, విజయ ప్రస్థానాన్ని సాగిస్తూ, దేశానికే దిక్సూచిగా నిలిచారని అన్నారు.
రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమానురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.