HomeCinema

నన్ను క్షమించండి… చేతులు జోడించిన ఆదిపురుష్ డైలాగ్ రైటర్

నన్ను క్షమించండి… చేతులు జోడించిన ఆదిపురుష్ డైలాగ్ రైటర్

ఆదిపురుష్ డైలాగులు రాసిన మనోజ్ ముంతషిర్ శుక్లాపై ఆయన్ అరాసిన డైలాగులకు గాను తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రేక్షకులను ఆయన క్షమాపణ కోరారు. ఆ చిత్రం

టాలీవుడ్ స్టార్లను ‘నాని’ అవమానించాడా? మండిపోతున్న ఆ నలుగురు హీరోల ఫ్యాన్స్
ప్రభాస్ రోజూ తాగుతాడా? ఆ బాలీ వుడ్ డైరెక్టర్ ప్రభాస్ ను అంత మాట అనేశాడేంటి ?
మళ్ళీ వెండి తెరపై మెరవనున్న ప్రభాస్, అనుష్క ల జంట

ఆదిపురుష్ డైలాగులు రాసిన మనోజ్ ముంతషిర్ శుక్లాపై ఆయన్ అరాసిన డైలాగులకు గాను తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రేక్షకులను ఆయన క్షమాపణ కోరారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైన కొన్ని వారాల తర్వాత శనివారం, మనోజ్ సోషల్ మీడియాలో బేషరతుగా క్షమాపణలు చెప్పాడు, “ఆదిపురుష్ లోని డైలాగుల‌ వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయి” అని ఆయన అంగీకరించారు.

మనోజ్ ట్విట్టర్‌లో ఇలా వ్రాశాడు, “ఆదిపురుష్ వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. ముకుళిత హస్తాలతో, నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి, మన పవిత్రమైన సనాతన ధర్మానికి, మన గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక.” అని ట్వీట్ చేశారు.

”భవిష్యత్తులో మరింత మెరుగ్గా పని చేస్తానని, మన గొప్ప దేశానికి సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను ” అని కూడా కామెంట్ చేశారు. గీత రచయిత, కవి, సంభాషణల రచయిత, స్క్రీన్ రైటర్ అయిన మనోజ్, కంగనా రనౌత్ రాబోయే చిత్రం సీత డైలాగ్‌లను కూడా వ్రాసినట్లు సమాచారం.
ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ గత నెలలో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం దాని డైలాగ్స్ మరియు VFX కారణంగా భారీ విమర్శలను ఎదుర్కొని తీవ్ర‌ వివాదంలో చిక్కుకుంది. మొదటి వారాంతం తర్వాత మేకర్స్ డైలాగ్‌లను సవరించినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద కోలుకోలేకపోయింది.
‘బాలీవుడ్ హంగామా’ ప్రకారం రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆదిపురుష్ దేశీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.133.54 కోట్ల నికరం రాబట్టగలిగింది.