HomeTelanganaPolitics

తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

Important: ప్లాంట్ శంఖుస్థాపనలో మంత్రి శ్రీధర్ బాబు గారి స్పీచ్ పాయింట్స్…!!!! *రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు

కాంగ్రెస్: నల్గొండ జిల్లాలో సీనియర్ల‌ మాటే చెల్లుబాటు… అక్కడ రేవంత్ రెడ్డి చెల్లని నాణమేనా ?
అనుచరుడి హత్యతో భగ్గుమన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి….ఇది బీఆరెస్ పనే అని ఆరోపణ‌
KCRతో తన రహస్య భేటీ గురించి బైటపెట్టి మోడీ కాంగ్రెస్ కు ఆయుధమిచ్చారా ?

Important:

ప్లాంట్ శంఖుస్థాపనలో మంత్రి శ్రీధర్ బాబు గారి స్పీచ్ పాయింట్స్…!!!!

*
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే మా లక్ష్యం అని ఐటి పరిశ్రమల శాఖ మత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులున్నాయని, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి “తెలంగాణ రైజింగ్”లో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు

తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, లెన్స్ కార్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద కళ్లజోడుల తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. దీంతో తెలంగాణ బ్రాండ్ విశ్వ వ్యాప్తం అవుతుందన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గతేడాది డిసెంబర్ 8న ఒప్పందం కుదిరిందని మంత్రి తెలిపారు.ఇప్పటికే లెన్స్‌కార్ట్ కు రాజస్థాన్‌లో అధునాతన కళ్లజోడు తయారీ యూనిట్‌ ఉందని,కానీ.. మన దగ్గర ఏర్పాటు కాబోయే ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ మంత్రి అన్నారు.అత్యాధునిక టెక్నాలజీ తో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ తెలంగాణ కు తలమానికం అవుతుందని,తయారీ రంగంలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్తుందన్నారు. రూ.1500 కోట్లతో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ ద్వారా సుమారు 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

ఈ ప్లాంట్ కు ప్రభుత్వం తరఫున తుక్కుగూడ సమీపంలో రావిర్యాలలో 50 ఎకరాలు కేటాయించామని, రెండేళ్లలో ఈ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని,నాలుగేళ్లలో పూర్తిగా కార్యకలాపాలు మొదలవుతాయన్నారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు జపాన్, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, సౌదీ అరేబియా దేశాలకు ఎగుమతి అవుతాయని


కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, లెన్స్ కార్ట్ ప్రతినిధులు చౌదరి, సుమిత్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.