స్పీకర్ పదవికి వన్నెతెచ్చిన శ్రీపాదరావు మంత్రి శ్రీధర్ బాబు పార్టీలకు అతీతంగా పనిచేసి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాద ర
స్పీకర్ పదవికి వన్నెతెచ్చిన శ్రీపాదరావు
మంత్రి శ్రీధర్ బాబు
పార్టీలకు అతీతంగా పనిచేసి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాద రావు అని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు అన్నారు.తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఆదివారం నిర్వహించిన శ్రీ దుద్దిళ్ల శ్రీపాద రావు 88వ జయంతి వేడుకల్లో సభా ప్రారంభకులు,గా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని ప్రసంగించారు
26 ఏళ్ల కిందట నాన్న గారిని కోల్పోయాం. కానీ… ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నారన్నారు
తన పనితీరుతో పార్టీలకు అతీతంగా అభిమానులను ఆయన సంపాదించుకున్నారన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్ళారని, ప్రజల కోసమే చివరి క్షణం వరకు తపించారని, అదే స్ఫూర్తితో ఆయన చూపిన అడుగు జాడల్లోనే మా కుటుంబ సభ్యులం నడుస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు .* నాన్న గారు భౌతికంగా మా నుంచి దూరమైనా.. ఆయన ఆశయాలు, ఆలోచనలు మాతోనే ఉన్నాయని, వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బృహత్తర బాధ్యత మాపై ఉందన్నారు. మేం ప్రజలకు చేయాల్సింది చాలా ఉందని, ప్రజలు మాపై చూపించే అభిమానం, ప్రేమకు సదా కృతజ్ఞుల మా చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పని చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేని లోటును పూడ్చలేనిదని, తనదైన పని తీరుతో రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్రన వేశారన్నారు. * నాన్న గారి జయంతిని ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించడం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని, ఇందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితర ప్రభుత్వ పెద్దలకు మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. * ఆయన పై అభిమానంతో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన
బీజేపీ శాసన సభ్యులు పాల్వాయి హరీష్, పైడి రాకేష్ రెడ్డి లకు మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంఎల్ఏలు మల్ రెడ్డి రంగారెడ్డి, మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.