HomeTelanganaPolitics

మంద కృష్ణ ఎన్ని కోట్లు తీసుకున్నాడు? కేఏ పాల్ బహిర్గత పర్చిన లెక్కలేంటి ?

మంద కృష్ణ ఎన్ని కోట్లు తీసుకున్నాడు? కేఏ పాల్ బహిర్గత పర్చిన లెక్కలేంటి ?

ప్రముఖ సువార్తికుడు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పరిచయం అవసరం లేని వ్యక్తి. సంచలన, వివాదాస్పద‌ వాదనలు చేయడంలో ఆయన ఫేమస్. తెలంగాణకు రేవంత్

తెలంగాణ బీజేపీకి షాక్ – మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా
నోరు మూసుకోక పోతే ఇంటికి ఈడీని పంపుతా – విపక్షాలకు కేంద్ర మంత్రి హెచ్చరిక‌
మణిపూర్ హింసాకాండకు నిరసనగా బీజేపీకి రాజీనామా చేసిన మరో నాయకుడు

ప్రముఖ సువార్తికుడు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పరిచయం అవసరం లేని వ్యక్తి. సంచలన, వివాదాస్పద‌ వాదనలు చేయడంలో ఆయన ఫేమస్. తెలంగాణకు రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ తనకు వెల్లువలా కాల్స్ వస్తున్నాయని ఈ మధ్యే చెప్పుకున్నాడాయన. బండ్ల గణేష్ లాంటి వారు కూడా తనకు ఫోన్ చేశారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన తన కాల్ హిస్టరీ చిత్రాలను చూపించాడు.

ఇప్పుడా కే ఏ పాల్ ఎమ్ ఆ పీఎర్స్ నాయకుడు మంద కృష్ణపై తన దాడిని ఎక్కుపెట్టాడు. మంద కృష్ణమాదిగ తన పార్టీలో చేరేందుకు 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని కేఏ పాల్ ఆరోపించారు. బీజేపీ ఆయనకు ఒక సభ నిర్వహించేందుకే 72 కోట్ల రూపాయలు ఇచ్చిందని అవే కాక ఇ‍ంకా ఎనో కోట్ల రూపాయలు మంద కృష్ణకు ఇవ్వడంతో బీజేపీకి మద్దతు ఇస్తున్నాడని మండిపడ్డారు.

ఎలాగూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కేంగ్రెస్ కు మళ్ళే అవకాశం ఉన్న‌ నేపథ్యంలో కాంగ్రెస్ కు పడతాయనుకుంటున్న మాదిగల ఓట్లను గంపగుత్తగా బీజేపీ వైపు మళ్ళించేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడలో మంద కృష్ణ పావు అయ్యాడని పలువురు మాదిగనేతలే ఆరోపిస్తున్న నేపథ్యంలో కేఏ పాల్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

అయితే కే ఏ పాల్ మాటలను సీరియస్ గా తీసుకోవాలా లేక కామెడీ అని కొట్టి పడేయాలా అనేది మీరే నిర్ణయించుకోండి