HomeTelangana

దోస్త్….కటిఫ్…దోస్త్…కటీఫ్…మల్ల ఇవ్వాళ్ళ దోస్తానా!

దోస్త్….కటిఫ్…దోస్త్…కటీఫ్…మల్ల ఇవ్వాళ్ళ దోస్తానా!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య టామ్ అండ్ జెర్రీ తరహా లో 'స్నేహమూ, శతృత్వము' అనే ఆట సాగుతోంది.వీళ్ళ మధ్య దోస్తానా, కటీఫ్ లు చిన్న ప

ఈ నెల 16న బీఆరెస్ భారీ బహిరంగసభ, ఆరోజే మేనిఫెస్టో విడుదల
ఉదయనిధి వ్యాఖ్యలపై ఇంత గొడవెందుకు, శపిస్తే సరిపోతుంది కదా !
ఎన్నికలకు ముందు పెరిగిన బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలు: అమెరికా సంస్థ రిపోర్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య టామ్ అండ్ జెర్రీ తరహా లో ‘స్నేహమూ, శతృత్వము’ అనే ఆట సాగుతోంది.వీళ్ళ మధ్య దోస్తానా, కటీఫ్ లు చిన్న పిల్లల తీరుగా నడుస్తోంది.

తమిళసైని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నర్ గా నియమించిన కొత్తలో కేసీఆర్ కు తమిళసై కి మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. అయితే కరోనా మహమ్మారి సమయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడంతో పాటు పలు అంశాలపై ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగారు.

COVID-19 మహమ్మారి సమయంలో సౌందరరాజన్ కొన్ని ఆసుపత్రులను సందర్శించి, సంక్షోభాన్ని ప్రభుత్వం నిర్వహించడం గురించి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడంతో 2020లో ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆమె వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యను గవర్న‌ర్ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

2021లో, యూనివర్శిటీల వైస్-ఛాన్సలర్‌లను నియమించేందుకు ప్రభుత్వానికి మరిన్ని అధికారాలను కల్పించే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుకు సౌందరరాజన్ ఆమె సమ్మతిని ఇవ్వడానికి నిరాకరించడంతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆమె రాజ్యాంగ అధికారాన్ని అతిక్రమించిందని ఆరోపించింది మరియు ఆమెపై సుప్రీంకోర్టులో కేసు వేసింది.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. 2022లో, సౌందరరాజన్ రాష్ట్ర గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేసీఆర్ ఆహ్వానించలేదు.
2021 లో కౌశిక్ రెడ్డిని కేసీఆర్ ఎమ్మెల్సీగా ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించడంతో కేసీఆర్, తమిళసై మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.
2023లో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించిన‌ రిపబ్లిక్ డే వేడుకలకు గవర్నర్ హాజరు కాలేదు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమాలకు కేసీఆర్ హాజరు కాలేదు.
అంతే కాదు కేసీఆర్ ప్రభుత్వ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పలు బిల్లులను గవర్నర్ అనుమతించలేదు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ పెండింగ్ లో పెట్టడం ఇరు వర్గాల‌ మధ్య మాటల‌ యుద్దానికి కూడా కారణమైంది.
అనేక సార్లు, కేసీఆర్ బహిరంగంగానే గవర్నర్ పై వి9మ్నర్శలు గుప్పించగా, తమిళసై కూడా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళి సై మధ్య సంబంధాలు మెరుగుపడటమే కాదు. ఇద్దరు కలిసి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మంత్రిగా పట్నం మహేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ రాజ్ భవన్ కు రావడమే కాకుండా గవర్నర్ తో సఖ్యతగా మెలిగారు. అంతే కాదు నూతన సచివాలయంలో గుడి, చర్చి, మసీదులను ప్రారంభించాల్సిందిగా కేసీఆర్ గవర్నర్ ను ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళసైని కేసీఆర్ శాలువా కప్పి సత్కరించడమే కాక ఆమెకు కొత్త సచివాలయాన్ని తిప్పి చూపించారు. ఇద్దరూ కలిసి ప్రార్దనాలయాలను ప్రారంభించారు. నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఈ సఖ్యత ఎంత కాలం సాగుతుందో తెలియదు కానీ కేంద్ర బీజేపీతో కేసీఆర్ కు ఉన్న సంబంధాలపైననే ఇక్కడ గవర్నర్ తో సంబంధాలు ఆదారపడి ఉంటాయనే చర్చ సాగుతోంది.