HomeTelanganaPolitics

మంత్రి హరీశ్ రావుపై బీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన ఆరోపణలు

మంత్రి హరీశ్ రావుపై బీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన ఆరోపణలు

బీఆరెస్ లో టిక్కట్ల లొల్లి రచ్చ రచ్చగా మారుతోంది. టిక్కట్లు రావనే టెన్షన్ తో కొందరు తమకు తోచిన విధంగా పైరవీలు చేస్తుండగా తమ వారసులకు టిక్కట్లు రాకపోవ

కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?
తెలంగాణలో హంగ్ వస్తే బీఆరెస్, బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందా ?
కేసీఆరె కే మా ఓటు: 10 గ్రామాల ప్రజల ఏకగ్రీవ తీర్మానం

బీఆరెస్ లో టిక్కట్ల లొల్లి రచ్చ రచ్చగా మారుతోంది. టిక్కట్లు రావనే టెన్షన్ తో కొందరు తమకు తోచిన విధంగా పైరవీలు చేస్తుండగా తమ వారసులకు టిక్కట్లు రాకపోవడంతో మరికొందరు మండిపోతున్నారు.

వెంకటేశ్వరుడి దర్శనం కోసం తిరుమల వెళ్ళిన మల్కాజీగిరి బీఆరెస్ ఎమ్మెల్యే మైనం పాటి హన్మంతరావు అక్కడ మీడియాతో మాట్లాడారు. తన కుమారుడికి మెదక్ ఎమ్మెల్యే టికట్ ఇప్పించడానికి తీవ్ర ప్రయత్నం చేసిన మైనం పాటి హన్మంతరావు మంత్రి హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకుకు టిక్కట్ రాకుండా చేసిన హరీశ్ రావు చరిత్ర అంతా తనకు తెలుసునని అన్నారు. ”ట్రంకు పెట్టె, రబ్బరు చెప్పులతో వెలుమ హాస్టల్ లో చేరడానికి వచ్చిన హరీశ్ రావు ఈ రోజు లక్ష కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు? అని ప్రశ్నించారు. ఆయన సంపాదన అంతా అక్రమ సంపాదనే అని హన్మంత రావు ఆరోపించారు.

ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం తనదే అని నియంతగా వ్యవహరిస్తున్నారని మైనంపల్లి హరీశ్ రావుపై ఆరోపణలు గుప్పించారు. టిక్కట్ ఇస్తే తనకు మల్కాజి గిరి, తన కొడుకుకు మెదక్ టిక్కట్ ఇవ్వాలని లేదంటే తన కొడుకును మెదక్ లో నిలబెట్టి బెలా గెలిపించుకోవాలో తెలుసునని ఆయన అన్నారు.

మెదక్ లో హ‌రీశ్ రావు జోక్యం ఏంటి అని ప్రశ్నించిన మైనంపల్లి , మెదక్ ను దోచి ఆయన సిద్దిపేటకు పెడుతున్నాడని మండిపడ్డారు. సిద్దిపేటను తప్ప ఉమ్మడి మెదక్ లో మరే నియోజకవర్గాన్ని కూడా అభివృద్ది చేయలేదని మైనంపల్లి ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో తన కుమారుడి ఎన్నిక పై దృష్టిపెడతానని, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీశ్ రావును ఓడించడమే లక్ష్యంగా ‍పని చేస్తానని మైనంపల్లి స్పష్టం చేశారు.