HomeNational

మోడీ 2గంటల ప్రసంగం: మణిపూర్ గురించి 10 నిమిషాలు, మిగతా సమయమంతా కాంగ్రెస్ పై దాడి

మోడీ 2గంటల ప్రసంగం: మణిపూర్ గురించి 10 నిమిషాలు, మిగతా సమయమంతా కాంగ్రెస్ పై దాడి

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం (ఆగస్టు 10) తన ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై పార్లమెంట

మల్కాజీగిరి ఎంపీగా పోటి చేయడానికి పట్టుబడుతున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి
మూడవ జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, రెండు చోట్ల నుంచి రేవంత్ పోటీ
‘ఇండియా’ కూటమికి మోడీ భయపడుతున్నాడా ?

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం (ఆగస్టు 10) తన ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై పార్లమెంటు వేదికపై మౌనం వీడారు.
అయితే, దాదాపు 2 గంటల 20 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో మోడీ కేవలం పది నిమిషాల పాటు రాష్ట్రంలో హింసాత్మక ఘటనల గురించి ప్రసంగించారు, అందులో తమ ప్రభుత్వం శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తోందని చెప్పారు.
అతని విస్తృతమైన ప్రసంగంలో మిగిలిన భాగం కాంగ్రెస్, గత యుపిఎ ప్రభుత్వాలు, ప్రతిపక్ష ఇండియా కూటమిపై దాడి తొమ్మిదేళ్ల మోడీ ప్రభుత్వంలో ఈశాన్య రాష్ట్రాల్లో తీసుకువచ్చిన అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.

మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై పార్లమెంటు లోపల ప్రధాని ప్రసంగించడమే అవిశ్వాస తీర్మానం లక్ష్యం అని ప్రతిపక్షాలు చెబుతున్నప్పటికీ జరిగింది మాత్రం అందుకు పూర్తి విరుద్దం.

మోడీ ప్రసంగంలో మణిపూర్ ప్రస్తావన లేకపోవడంతో 1 గంట 40 నిమిషాల ప్రసంగం తర్వాత వాకౌట్ చేసిన ప్రతిపక్షాల నిరసనల మధ్య మోడీ ప్రసంగం హై డ్రామాగా కనిపించింది.

అదే సమయంలో, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి సస్పెండ్ అయ్యారు.
సభలో విపక్ష ఎంపీలు గైర్హాజరవడంతో చివరికి మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

ప్రధాని మోదీ సాయంత్రం 5 గంటలకు ప్రసంగించడం ప్రారంభించగా, ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయడం ప్రారంభించడంతో 6.42 గంటలకు మణిపూర్ గురించి ప్రస్తావించారు.

“మణిపూర్ హైకోర్టు నుండి ఒక ఆర్డర్ వచ్చిందని, ఇది రాష్ట్రంలో హింసకు దారితీసిందని నిన్న, అమిత్ భాయ్ (షా) తెలిపారుది. చాలా కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయాయి. మహిళలపై ఘోరమైన నేరాలు జరిగాయి. ఇది ఖండించదగినది.”అని అన్నారు.

”నేరస్థులను శిక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మా ప్రయత్నాలన్నీ కొనసాగుతున్నాయి. త్వరలో శాంతి పునరుద్ధరిస్తామని నేను పౌరులందరికీ హామీ ఇస్తున్నాను. మణిపూర్ త్వరలో అభివృద్ధి దిశగా కొత్త ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతుంది.

“ మణిపూర్ ప్రజలకు, మహిళలు, కుమార్తెలు, సోదరీమణులకు దేశం మీతో ఉందని, ఈ సభ మీతో ఉందని చెప్పాలనుకుంటున్నాను. మేము కలిసి ఈ సవాలును ఎదుర్కొంటాము. శాంతిని తిరిగి తీసుకువస్తాము. మణిపూర్ త్వరలో శాంతి దిశగా పయనించేలా చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నామని మణిపూర్‌కు చెప్పాలనుకుంటున్నాను” అని ఆయన అన్నారు.

మణిపూర్‌పై మోడీ చేసిన సంక్షిప్త వ్యాఖ్యలలో కూడా మోడీ ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకున్నారు.

“వారు షా అభ్యర్థనలకు అంగీకరించినట్లయితే, మేము మంచి చర్చలు జరిపి ఉండేవాళ్లం. షా నిన్న వివరణాత్మక ప్రకటన ఇచ్చాడు. మణిపూర్‌లో పరిస్థితి గురించి ప్రతిపక్షాలు ప్రచారం చేసిన అబద్ధాలతో దేశం ఆశ్చర్యపోయింది, ”అని ఆయన అన్నారు.

“మణిపూర్‌పై చర్చకు రండి అని మేము చెప్పాము. హోం మంత్రి కూడా ఒక లేఖ రాశారు. కానీ వారికి ఆ ఉద్దేశ్యం లేదా ధైర్యం లేదు. ”

“మణిపూర్ సమస్యలను ఇప్పుడే ప్రారంభమైనట్లుగా చూపుతున్నారు. షా నిన్న విస్తృతంగా వివరించినట్లు – ఈశాన్య సమస్యల మూలం కాంగ్రెస్. ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ రాజకీయాలే తప్ప ఈశాన్య ప్రాంత ప్రజలు కాదు’’ అని అన్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలకు చేసింది తక్కువేనని ప్రధాని అన్నారు.

“మీరు (కాంగ్రెస్) ఈశాన్య రాష్ట్రాల భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు,” అని ఆయన అన్నారు.
“నేను 50 సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో సందర్శించాను.” అన్నారు మోడీ

‘దేశాన్ని కాంగ్రెస్‌ మూడు ముక్కలు చేసింది’

మణిపూర్‌లో భారత మాతను మోడీ హత్య చేశారని బుధవారం నాడు ఆరోపించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి మోడీ రాహుల్ మాటలు ప్రతి భారతీయుడిని బాధించాయని అన్నారు.” అధికారం లేకుండా కొంతమంది జీవించలేరు. ఇది ఎలాంటి భాష?” అన్నారు మోడీ

“ఈ వ్యక్తులు రాజ్యాంగాన్ని హత్య చేయడం గురించి మాట్లాడుతున్నారు. ఆగస్ట్ 14న జరిగిన భారతదేశ విభజనను మరిచిపోయారా?” అని ఆయన ప్రశ్నించారు.

“మేము ఇప్పటికీ ఆ బాధతో జీవిస్తున్నాము. ఈ వ్యక్తులు మ‌న దేశాన్ని స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భార‌త్‌ను మూడు ముక్క‌ల‌గా విడ‌దీసారు.” అని ఆరోపించారు మోడీ.

లంకను హనుమంతుడు తగలబెట్టలేదని, అతని అహంకారం వల్లనే తగలబడిందని రాహుల్ గాంధీ బుధవారం చేసిన ప్రసంగాన్ని లక్ష్యంగా చేసుకుని మోడీ అది నిజమేనని అంగీకరించారు.
ఇది నిజం, అందుకే ఈ దేశ ప్రజలు రాముడిలా ప్రవర్తించారు. ఆ అహంకారాన్ని అంతం చేశారు. 400 సీట్ల నుంచి ఇప్పుడు 40కి దిగజారాయని చెప్పారు.

“తమ కూటమి పేరును ఇండియాగా మార్చడం ద్వారా వారు దేశాన్ని పాలిస్తారని వారు భావిస్తున్నారు. కానీ ఇది ఘమాండీయ (అహంకార) కూటమి. మీ పేరు మార్చడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని మార్చలేరు అని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను, ”అని మోడీ చెప్పాడు.

కాగా, గంటా 40 నిమిషాల తర్వాత వాకౌట్ చేసిన ప్రతిపక్షం.. మోడీ మణిపూర్ గురించి మాట్లాడకుండా రాజకీయ ప్రసంగం చేయడం వల్లే ఈ స్టెప్ వేశామని అన్నారు.

కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ ది వైర్‌తో మాట్లాడుతూ, ప్రధాని అన్ని బాధ్యతల నుండి తప్పుకున్నందున ఇండియా బ్లాక్ వాకౌట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

“ప్రధానమంత్రి మణిపూర్‌లో జరిగిన అన్ని వైఫల్యాల నుండి కేంద్రంలో, రాష్ట్రంలోని తన ప్రభుత్వాలను తప్పించజూస్తున్నారు. మణిపూర్‌లో హింస, అత్యాచారాలకు ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. వారు విభజించబడిన మణిపూర్‌ను కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి (ఎన్. బీరెన్ సింగ్)తో డ్రగ్ మాఫియా అనుబంధం కొనసాగుతుందని తెలుస్తోంది. నిరుద్యోగం , చైనా వంటి కీలక సమస్యలపై సమాధానాలు చెప్పలేదు. J&K మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పుల్వామాపై చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పించారు. ఈ కారణాలన్నింటికీ భారత కూటమి వాకౌట్ చేయాలని నిర్ణయించుకుంది.” అని గొగోయ్ తెలిపారు.