బేతవోలు గ్రామంలో ఉద్రిక్తత కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు కోదాడ నినాదంసూర్యాపేట జ
బేతవోలు గ్రామంలో ఉద్రిక్తత
కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ
రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
కోదాడ నినాదం
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బెతవోలు గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈనెల 21,22 తారీకులలో
గ్రామంలో బండ్ల పండుగ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పురాతన రామాలయ పునర్మాణం , శివాలయం పున నిర్మాణం చేసేందుకు గ్రామంలోని పెద్దలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సందర్భంలో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగిందని , రాజకీయ నాయకులను కమిటీలో చోటు కల్పించొద్దని ఒక వర్గం ప్రతిపాదిస్తే మరొక వర్గం కల్పించాల్సిందేనని పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య మాటా మాటా ముదిరి దాడికి దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ గ్రామాన్ని రణరంగంగా మార్చారు. పోలీసులకు సమాచారం అందడంతో సూర్యాపేట పెద్దగట్టు జాతరలో బందోబస్తు నిర్వహిస్తున్న కోదాడ పోలీసులు హుటాహుటిన బేతవోలు గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాలను చల్లా చెదురుచేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.