HomeTelanganaUncategorized

పరకాలలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

పరకాలలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

పరకాలలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు పరకాల సెప్టెంబర్ 2 (నినాదం న్యూస్) : పరకాల పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ మండల పార్టీ కార్యా

విత్తనాలు అందక రోడ్లెక్కిన రైతన్నలు: ప్రభుత్వ వైఫల్యం పై ధ్వజమెత్తిన ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతాం… స్పష్టం చేసిన కాంగ్రెస్ ఇంచార్జ్

పరకాలలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

పరకాల సెప్టెంబర్ 2 (నినాదం న్యూస్) : పరకాల పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో. దివంగత ముఖ్యమంత్రి రూపకర్త డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రైతు ఋణమాఫీ ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108,104 అంబులెన్సులు, లక్షల పెన్షన్స్ , విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి దేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎంపీపీ ఒంటేరు రామ్మూర్తి డిసిసి చేనేత సెల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసరి బిక్షపతి,మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘు నారాయణ బొమ్మ కంటి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.