HomeTelangana

గుమ్మడి విఠల్ రావు గద్దర్ గా ఎలా మారారు ?

గుమ్మడి విఠల్ రావు గద్దర్ గా ఎలా మారారు ?

గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు , ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ ల

గద్దర్ మృతికి ప్రముఖుల సంతాపం
అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు – ముఖ్యమంత్రి ఆదేశాలు
మనిషిని చంపేసిన రోబో

గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు , ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నాడు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నాడు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వాడు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.

కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవాడు. ఆ తర్వాత అతను అనేక పాటలు రాసాడు. 1972 లో పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించేందుకు జన నాట్య మండలి ఏర్పడింది. ఇది దళితులను మేల్కొలిపేందుకు, వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది. 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ పరీక్షను రాసాడు. అయన కెనరా బ్యాంకులో క్లార్క్ గా చేరాడు, తర్వాత అతను విమలను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు వెన్నెల. చంద్రుడు 2003 లో అనారోగ్యంతో మరణించారు.

మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడాడు. 1984 లో ఆయన క్లార్కు ఉద్యోగానికి రాజీనామా చేసి జననాట్య మండలి పూరెతి స్థాయి కార్యకర్తగా మారారు. . 1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. ఒగ్గు కథ, బుర్ర కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. గోచి , గొంగళి ధరించేవాడు. ఆయన పాడే పాటలు ప్రజల్లో విప్లవ చైతన్యం రగిలించాయి. దళితులు, పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సిడిలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలో ఆట, మాట, పాట బంద్ అయిపోయి, తీవ్ర నిర్బంధం రాజ్యమేలుతున్న కాలంలో గద్దర్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళారు. మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత‌ నక్సలైట్లపై నిషేధం ఎత్తి వేయబడింది. అప్పుడు అండర్ గ్రౌండ్ నుంచి బయిటికి వచ్చిన గద్దర్ 1990 ఫిబ్రవరి 18 న జన నాట్య మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.

చంద్రబాబు ముఖ్యమ‍ంత్రిగా ఉండగా 1997 ఏప్రిల్ 6 న ఆయన పై పోలీసులు తుపాకీ గుళ్ళు కురిపించారు. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్ లను తొలగించారు కాని ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికీ బుల్లెట్ ఉంది. 2002 లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్లు గద్దర్, వరవరరావు, కళ్యాణ్ రావులను తమ దూతలుగా పంపారు.

తెలంగాణ ఉద్యమంలో
తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో, గద్దర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన పోరాటాన్ని ప్రారంభించారు. బలమైన
గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణా పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్. తెలంగాణ ఉద్యమ కాలంలో గద్దర్ తెలంగాణా ప్రజా ఫ్రంట్ ను స్థాపించాడు.

సినిమారంగం
గద్దర్ మాభూమి సినిమాలోని బండెనక బండి కట్టి అనే పాటను పాడడంతోపాటు ఆ పాటలో నటించాడు. ఆయన రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన “నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ” అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు. ఆయన మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. ‘పొడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా..’ పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో తీసిన ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాలో గద్దర్ కీలకపాత్ర పోషించారు. ఇదే గద్దర్ నటించిన చివరి సినిమా.
ఆయన ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చివరి శ్వాస వదిలారు.