HomeTelanganaPolitics

విద్వేషపు ‘విశ్వగురువు’: మోడీ పాలనపై హైదరాబాద్‌లో రేపు పుస్తకం విడుదల

విద్వేషపు ‘విశ్వగురువు’: మోడీ పాలనపై హైదరాబాద్‌లో రేపు పుస్తకం విడుదల

మోడీ పాలనపై “విద్వేషపు ‘విశ్వగురు’ అనే పుస్తకాన్ని ఆగస్టు 5, 2023 సాయంత్రం 6 గంటలకు, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివ

‘స్వామీ.. నదికి పోలేదా? .. లేదు, నదే సిటీకి వచ్చింది’
దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టిన వజ్రోత్సవాలు
పాపం కృష్ణ మాదిగ…అంతన్నారింతన్నారు….అద్దాల మేడన్నారు… చివరకు తుస్సుమనిపించిన మోడీ

మోడీ పాలనపై “విద్వేషపు ‘విశ్వగురు’ అనే పుస్తకాన్ని ఆగస్టు 5, 2023 సాయంత్రం 6 గంటలకు, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో విడుదల చేయనున్నారు.

సీనియర్ జర్నలిస్టు, వీక్షణం పత్రి ఎడిటర్, ప్రముఖ రచయిత ఎన్.వేణుగోపాల్ రచించిన ఈ పుస్తకాన్ని రచయిత, కాలమిస్ట్,’ ప్రైస్ ఆఫ్ మోడీ ఇయర్స్, అవర్ హిందూ రాష్ట్ర’ రచయిత ఆకార్ పటేల్ విడుదల చేస్తారు.
ఈ కార్యక్రమానికి సియాసత్ డైలీ మేనేజింగ్ డైరెక్టర్ జహీరుద్దీన్ అలీఖాన్ అధ్యక్షత వహిస్తారు.
సాహితీ విమర్శకులు, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం కన్వీనర్‌ ఆకునూరి మురళి, ఐఏఎస్‌, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె శ్రీనివాస్‌ పుస్తకాన్ని పరిచయం చేస్తారు.

మలుపు ప్రచురణల తరపున బాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతారు.