HomeTelanganaPolitics

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు… బీజేపీ అధిష్టానం నిర్ణయం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు… బీజేపీ అధిష్టానం నిర్ణయం

బీజేపీ రాష్ట్ర శాఖలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిని మార్చేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి

రాహుల్ గా‍ంధీ యాత్రపై కేసు నమోదు
బీజేపీ రాష్ట్ర‌ కార్యాలయంలో బండి, ఈటల వర్గాల మధ్య ఘర్షణ‌
హోంమంత్రి పోలీసును కొట్టిన సంఘటన‌పై స్పందించిన కవిత‌

బీజేపీ రాష్ట్ర శాఖలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిని మార్చేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఏ క్షణమైనా బీజేపీ అధిష్టానం ప్రకటన చేసే అవకాశం ఉంది.

బండి సంజయ్‌ స్థానంలో అధ్యక్షుడిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డిని నియమించేందుకు పార్టీ కేంద్ర నాయకత్వం సంకల్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ హైకమాండ్ సంజయ్‌ను ఎప్పుడైనా ఢిల్లీకి పిలిపించుకుని తమ నిర్ణయం చెప్పే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కిషన్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో సహా పలువురు సీనియర్‌ నేతలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు.

రాష్ట్ర శాఖలో నాయకత్వ మార్పుపై ఢిల్లీలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కిషన్ రెడ్డి స్పందించేందుకు నిరాకరించారు. బండి సంజయ్ ఆదివారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన స్థానంలోకి వేరేవారు వస్తారని సూచించారు. జులై 8న వరంగల్‌లో జరిగే ప్రధాని మోదీ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడి హోదాలో నేను పాల్గొంటానో లేదో నాకు తెలియదు అని అన్నారు. ఢిల్లీలో మీడియా తో మాట్లాడిన రఘునందన్ రావు కూడా సంజయ్ మార్పు పై మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజమే అని స్పష్టం చేశారు.

బండి సంజయ్ రాష్ట్ర శాఖ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రత్యర్థి పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతల నుంచే కాకుండా సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. వాస్తవానికి సంజయ్ పనితీరుపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసి ఆయనను మార్చాలని కోరారు.

సంజయ్‌పై తిరుగుబాటు చేస్తున్న పార్టీ నేతలను శాంతింపజేసేందుకు తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పడంతో ఇప్పుడు ఆయన స్థానంలో కిషన్‌రెడ్డిని నియమించాలని నిర్ణయించారు.

బండి సంజయ్ పార్టీ సీనియర్ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండకపోవడంతో ఆయనకు ప్రజాదరణ లేకుండా పోయింది. కొత్త అధ్యక్షుడు స్వతంత్రంగా పనిచేసేలా కేంద్ర మంత్రివర్గంలో సంజయ్‌కు చోటు కల్పించే అవకాశం ఉంది.