HomeTelanganaUncategorized

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులుగా భోజనపల్లి నర్సింహ్మ మూర్తి

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులుగా భోజనపల్లి నర్సింహ్మ మూర్తి

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులుగా భోజనపల్లి నర్సింహ్మ మూర్తి విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా భోజనపల్లి నర్సింహ్మ మూర్తి ని నియ

మోగనున్న అసె‍ంబ్లీ ఎన్నికల నగారా – ఈ నెల 10లోపు నోటిఫికేషన్ విడుదల‌
బీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు… రోడ్డెక్కిన నాయకులు, కార్యకర్తలు
త్వరలో రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు: సీఎం రేవంత్ రెడ్డి

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులుగా భోజనపల్లి నర్సింహ్మ మూర్తి

విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా భోజనపల్లి నర్సింహ్మ మూర్తి ని నియమించారు.
ఆయనతో పాటుగా భాగ్యనగర్ క్షేత్ర సంఘటనా మంత్రిగా గుమ్మళ్ల సత్యం నియామకం జరిగింది.
అయోధ్యలో గత మూడు రోజులుగా జరుగుతున్న విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సమావేశాలలో ఈరోజు జాతీయ స్థాయిలో మరియు వివిధ రాష్ట్ర కమిటీలలో మార్పులు చేస్తూ కొత్త నియామకాలను జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ ప్రకటించారు. తెలంగాణా రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షులుగా శ్రీ భోజనపల్లి నర్సింహ్మ మూర్తి ని మరియు భాగ్యనగర్ క్షేత్ర (TS & AP రాష్ట్రాలు) సంఘటనా మంత్రిగా శ్రీ గుమ్మళ్ల సత్యం నునియమించారు. నర్సింహ్మ మూర్తి గారు చిన్ననాటి నుండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశారు, వివిధ స్థాయిలలో బాధ్యతలు నిర్వహించారు. బి ఎం ఎస్ (భారతీయ మజ్దార్ సంఘ్ ) లో కూడా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం వీహెచ్ పి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న నర్సింహ్మ మూర్తి ని రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షులుగా నియమించారు.
శ్రీ గుమ్మళ్ళ సత్యం వీహెచ్ పి లో రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు .వారిని భాగ్యనగర్ క్షేత్ర సంఘటనా మంత్రిగా నియమించారు. వారి నియామకం పట్ల తెలంగాణా రాష్ట్ర శాఖ హర్షాన్ని ప్రకటిస్తుంది.