HomePoliticsNational

రాహుల్ గా‍ంధీ యాత్రపై కేసు నమోదు

రాహుల్ గా‍ంధీ యాత్రపై కేసు నమోదు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వ‌హిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర పై అస్సాం ప్రభుత్వం కేసు నమోదు చేసింది.యాత్ర మార్గానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ

మావోయిస్టుల జాడ తెలుసుకునేందుకు.. పావురాలకు పోలీసు శిక్షణ
టీచర్ ముసుగులో మతోన్మాది..ముస్లిం బాలుడిని హిందూ పిల్లలతో కొట్టించిన ఉపాధ్యాయురాలు
‘గ్రూప్స్’ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మ‌హత్య..అర్దరాత్రి హైదరాబాద్ లో విద్యార్థుల ఆందోళన‌

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వ‌హిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర పై అస్సాం ప్రభుత్వం కేసు నమోదు చేసింది.
యాత్ర మార్గానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారత్ జోడో న్యాయ్ యాత్రపై, దాని నిర్వాహకుడు KB బైజుపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు.

గురువారం మధ్యాహ్నం యాత్ర జోర్హాట్ పట్టణం గుండా వెళుతుండగా, ర్యాలీ నిర్వాహకులు కేటాయించిన మార్గం నుంచి కాకుండా మరో మార్గం నుంచి వెళ్ళారని పోలీసులు తెలిపారు.

రూట్‌లో అకస్మాత్తుగా మార్పులు చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయాలకు దారితీసిందని, కెబి బైజియు, ఇతరులతో సహా నిర్వాహకులు ట్రాఫిక్ బారికేడ్‌లను బద్దలు కొట్టడానికి గుంపును ప్రేరేపించారని, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులపై దాడి చేశారని పోలీసులు తెలిపారు.
యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు కావాలనే ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయడం ప్రభుత్వం ఎత్తుగడ అని ప్రతిపక్ష కాంగ్రెస్ నేత దేబబ్రత సైకియా ఆరోపించారు.

“పిడబ్ల్యుడి పాయింట్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులో పోలీసులెవరూ లేరు. కేటాయించిన మార్గం చాలా చిన్నది. మేము పెద్ద సంఖ్యలో గుమికూడాము. కాబట్టి, మేము కేవలం కొన్ని మీటర్లు పక్కదారిలో వెళ్ళాము. హిమంత బిశ్వా శర్మ యాత్ర విజయవంతమవుతుందనే భయంతో ఉన్నారు. అందుకే యాత్రకు అడ్డంకులు సృష్టించే పనిలో పడ్డారు రో” అన్నారాయన.

కాగా, శుక్రవారంతో యాత్ర ఆరవ రోజుకు చేరుకోగా, రాహుల్ గాంధీ ఇతర యాత్ర సభ్యులతో కలిసి అతిపెద్ద నది ద్వీపమైన మజులీకి ఫెర్రీలో వెళ్లారు.
అస్సాంలో 17 జిల్లాల మీదుగా 833 కి.మీ మేరకు జనవరి 25 వరకు ఈ యాత్ర సాగుతుంది.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. మొత్తం ప్రణాళిక ప్రకారం 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల్లో 67 రోజుల పాటు 6,713 కి.మీ యాత్ర సాగుతుంది.