HomeTelangana

కోదాడలో బిఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు

కోదాడలో బిఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు

కోదాడ:అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.సోమవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే

కాంగ్రెస్ కు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా… త్వరలోనే బీఆరెస్ లో చేరిక‌
మల్కాజీగిరి ఎంపీగా పోటి చేయడానికి పట్టుబడుతున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి
కారు సర్వీసింగుకు వెళ్ళింది, మరింత స్పీడ్ గా వస్తుందన్న‌ కేటీఆర్

కోదాడ:అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.సోమవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యలయం లో మునగాల మండలంలోని వెంకటరాంపురం, సీతానగరం గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 100 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని, దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దిక్కులేని పార్టీగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరానికి ముందు ఆకలి చావులు ఉండేవి. నేడు కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రజల మూడు పూటలు కడుపు నింపుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు.నేటికీ బిజెపి పాలిత ప్రాంతాలలో ప్రజల ఆకలి చావులు కొనసాగుతున్నాయి.రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత విద్యుత్ 24 గంటలు అందిస్తున్నామన్నారు.యావత్ భారత దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం నిరీక్షిస్తుందన్నారు..దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన కేసీఆర్ పాత్ర కీలకం కానుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రతీసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు.. . పార్టీలో చేరిన వారు జిల్లెపల్లి వెంకటేశ్వర్లు, బుసి శంకర్, జిల్లా పెళ్లి నరేష్, బాణాల నాగయ్య, ఉపేందర్, శ్రీను, మంగళగిరి సోమయ్య, రమేష్, సైదులు, విక్రమ్ కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తోగారు రమేష్, సొసైటీ చైర్మన్ సీతారాములు, సర్పంచ్ రమ శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు బూసి వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు