HomeTelanganaUncategorized

మేకలు ఎత్తుకెళ్లారని యువకుడికి చిత్రహింసలు

మేకలు ఎత్తుకెళ్లారని యువకుడికి చిత్రహింసలు

మంచిర్యాల ప్రతినిధి సెప్టెంబర్ 2 (నినాదం న్యూస్) మేకలు ఎత్తుకెళ్లారని యువకుడిని చిత్రహింసలు గురిచేసిన యజమాని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేస

మంత్రి పొంగులేటి అకస్మిక పర్యటన
గులాబీ గూటికి వలసల వెల్లువ:గంగుల సమక్షంలో చేరికలు
కేసీఆర్ కుటుంబ సభ్యుడు మరొకరికి కీలక పదవి

మంచిర్యాల ప్రతినిధి సెప్టెంబర్ 2 (నినాదం న్యూస్)

మేకలు ఎత్తుకెళ్లారని యువకుడిని చిత్రహింసలు గురిచేసిన యజమాని

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.మందమర్రి పట్టణంలోని యాపల్ కు చెందిన కిరణ్ అనే దళిత యువకుడిని మేకల మండిలో 2మేకలను దొంగతనం చేసాడనే నెపంతో యజమాని రాములు,శ్రీనివాస్,స్వరూప,నరేష్ లు మేకల కొట్టం దగ్గరికి తీసుకెళ్లి కట్టేసి తలకిందులుగా వెళ్లాడదీసి పొగ పెట్టి మరి చిత్రహింసలకు గురి చేసారు.మేక దొంగతనం చేసినందుకు డబ్బులు కట్టాలని అతడిని తీవ్రంగా కొట్టారు.విషయం తెలుసుకున్న శ్రావణ్ అనే స్థానిక యువకుడు మేకల డబ్బులు నేను కడుతానాని చెప్పి తాళ్లతో కట్టేసిన వ్యక్తిని ఇంటికి తీసుకువచ్చారు.మరుసటి రోజు శుక్రవారం సాయంత్రం నుండి కిరణ్ కనిపించకపోవడంతో కుటుంబీకులు మందమర్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సి,ఎస్టి కేసులు నమోదు చేసారు.అనంతరం బెల్లంపల్లి ఎసిపి సదయ్య కేసు విచారణ చేపట్టారు.ఈ అగాయిత్యానికి పాల్పడ్డవారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.కాగా కనిపించకుండా పోయిన కిరణ్ ఆచూకీ కోసం ఎసిపి 4బృందాలను రంగంలోకి దింపి తీవ్రంగా గాలిస్తున్నారు.