HomeTelanganaUncategorized

ఘనంగా నేలకొండపల్లి లో వై.యస్.రాజశేఖర్ రెడ్డి 14 వ వర్థంతి

ఘనంగా నేలకొండపల్లి లో వై.యస్.రాజశేఖర్ రెడ్డి 14 వ వర్థంతి

ఘనంగా నేలకొండపల్లి లో వై.యస్.రాజశేఖర్ రెడ్డి 14 వ వర్థంతి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి 14వ వర్థంతి సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేస

ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్ ను పోస్ట్ మాస్టర్ జనరల్ ఆకస్మిక తనిఖీ…!!
కాంగ్రెస్ మార్క్ గూండాయిజం: కాంగ్రెస్ గ్రూపుల మధ్య కొట్లాట – జర్నలిస్టులను చితకబాదిన కాంగ్రెస్ నేతలు
ధర్మపురి అరవింద్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడికెళ్ళి ఓడిస్తా -కల్వకుంట్ల కవిత‌

ఘనంగా నేలకొండపల్లి లో వై.యస్.రాజశేఖర్ రెడ్డి 14 వ వర్థంతి

డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి 14వ వర్థంతి సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన నేలకొండపల్లి యువజన కాంగ్రెస్ నాయకులు

పాలేరు సెప్టెంబర్ 2(నినాదం న్యూస్)

నేలకొండపల్లి మండలంలో నేలకొండపల్లి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి 14 వ వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ పాల్గొని, వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం జెర్రిపోతుల అంజనీ మాట్లాడుతూ,పేదలకు స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, పించన్లు, మెరుగైన వైద్యం కల్పించడానికి ఆరోగ్య శ్రీ, ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి నదీ జలాలు తీసుకురావాలన్న ఉద్ధేశ్యంతో ప్రారంభించిన జలయజ్ఞం, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలా అనేక కార్యక్రమాలు ముందు చూపుతో చేసిన మహనీయుడు వై.యస్.ఆర్ అని,వారు రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే అయన లక్ష్యం అన్నారు.ఈ కార్యక్రమంలో ,పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ పగిడికత్తుల సుదర్శన్, కొండా ఉపేందర్,సోమనబోయిన సాయి నవీన్,కిన్నెర రవి,తాతా అఖిల్, యాతకుల వంశీ,పడిశాల అనిల్,కాటూరి శేఖర్,గుంజా గోపి, తోట శివ,మారేపల్లి చంద్రపాల్ , తోడాటి రాము,తదితరులు పాల్గొన్నారు.