HomeNational

నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేయలేనంటూ కోర్టు హాల్ లోనే హైకోర్టు జడ్జి రాజీనామా

నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేయలేనంటూ కోర్టు హాల్ లోనే హైకోర్టు జడ్జి రాజీనామా

బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ కు అధ్యక్షత వహిస్తున్న జస్టిస్ రోహిత్ దేవ్ శుక్రవారం రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేయలేనని జస

బీఆరెస్ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్…ఎన్నిక చెల్లదంటూ తీర్పు
మరో బీఆరెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిన హైకోర్టు
సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కోకాపేట స్థలం విషయంలో హైకోర్టు నోటీసులు

బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ కు అధ్యక్షత వహిస్తున్న జస్టిస్ రోహిత్ దేవ్ శుక్రవారం రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేయలేనని జస్టిస్ రోహిత్ దేవ్ బహిరంగంగా కోర్టులోనే ప్రకటించారు.

“నేను రాజీనామా సమర్పించానని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా నేను పని చేయలేను. మీరు కష్టపడి పని చేయండి” అని న్యాయస్థానం వద్ద హాజరైన న్యాయవాదులతో జస్టిస్ దేవ్ అన్నారు.
అయితే, ఈ నిర్ణయం వెనుక గల కారణాలను జస్టిస్ డియో పేర్కొనలేదు. కొన్ని సందర్భాల్లో తమతో కఠినంగా ప్రవర్తించినందుకు న్యాయవాదులకు క్షమాపణలు చెప్పారు.

“కోర్టుకు హాజరైన వారికి, నేను మీలో ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాను. మీరు బాగుపడాలని నేను మిమ్మల్ని కొన్ని సార్లు కోప్పడ్డాను. మీరందరూ నాకు కుటుంబం లాంటివారు కాబట్టి మీలో ఎవరినీ బాధపెట్టాలని నేను కోరుకోను.” అని ఆయన‌ చెప్పాడు.

జస్టిస్ రోహిత్ దేవ్ ఆకస్మికప్రకటన‌తో కోర్టుకు హాజరైన లాయర్లు ఉలిక్కిపడ్డారు.

జస్టిస్ దేవ్ జూన్ 2017లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. డిసెంబర్ 2025లో పదవీ విరమణ చేయవలసి ఉంది.

2022లో మావోయిస్టు లింక్‌ల ఆరోపణ కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పు తో సహా జస్టిస్ దేవ్ ఇచ్చిన కొన్ని ప్రముఖ తీర్పులు ప్రభుత్వానికి నచ్చలేద‌ని తెలుస్తోంది. ప్రొఫెసర్ సాయిబాబాకు యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేస్తూ, విచారణ ప్రక్రియ పూర్తిగా శూన్యమని జస్టిస్ దేవ్ పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద ఈ కేసు చెల్లుబాటు కాదని ఆయన తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత అదే రోజు ఆగ‌మేఘాల మీద సుప్రీం కోర్టుకు వెళ్ళిన పోలీసులు సాయిబాబా విడుదల కాకముందే ఆ తీర్పుపై స్టే తెచ్చుకున్నారు.

అంతే కాక ముంబయ్, నాగ్ పూర్ సమృద్ది ఎక్స్ ప్రెస్ వే కు సంబందించి నిర్మాణ పనుల సమయంలో కాంట్రాక్టర్లు జరిపిన మైనర్ ఖనిజాల అక్రమ తవ్వకానికి సంబంధించి రెవెన్యూ శాఖ ప్రారంభించిన అన్ని శిక్షాత్మక చర్యలను రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 3న చేసిన తీర్మానంపై జస్టిస్ దేవ్ స్టే విధించారు.