HomeTelangana

సాహిత్యంతో ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన దాశరథి కృష్ణామాచార్యులు…. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

సాహిత్యంతో ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన దాశరథి కృష్ణామాచార్యులు…. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

తెలంగాణ మహోన్నత కవి, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషా పండితుడు దాశరథి కృష్ణమాచార్య 99 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వారి సేవలను స్

ఎమ్మెల్యే సీతక్కను సెక్రటేరియట్ లోకి వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు
సీఎం కేసీఆర్ నియోజకవర్గాన్ని మారుస్తున్నారా? గజ్వేల్‌కు గుడ్ బై చెప్తారా?
కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ మరో సారి ఝలక్ ఇవ్వబోతున్నారా?

తెలంగాణ మహోన్నత కవి, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషా పండితుడు దాశరథి కృష్ణమాచార్య 99 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వారి సేవలను స్మరించుకున్నారు. ‘ నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన దాశరథి కృష్ణామాచార్యులు, తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డగా సిఎం కొనియాడారు. సాహిత్యంలోని పలు ప్రక్రియల్లో విశేష కృషి చేసి తెలుగు భాషా సాహిత్యాన్ని దాశరథి సుసంపన్నం చేశారని సీఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా దాశరథి కృష్ణామాచార్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడంతో పాటు, తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన కవులకు దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నదని సీఎం తెలిపారు. 2023 సంవత్సరానికిగాను అయాచితం నటేశ్వర శర్మకు దాశరథి పురస్కారాన్ని ప్రకటించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. దాశరథి కృష్ణమాచార్యుల ఆశయాల మేరకు ముందుకు సాగుతున్నామని సిఎం అన్నారు. తెలంగాణను సాధించడంలోనూ రాష్ట్ర ప్రగతిని కొనసాగించడంలోనూ వారి స్పూర్తి ఇమిడి వున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక అస్తిత్వంతో, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని సీఎం అన్నారు.

dasharadhi, cm, kcr